ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. పీఆర్సీ సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామని ఆయన తెలిపారు.
Read Also: ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
Also Read
ఉద్యోగులకు మంచి జరగాలనే వారి సర్వీసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచామని సీఎం జగన్ వెల్లడించారు. జూన్ 30లోగా కారుణ్య నియామకాలు జరపాలన్నారు. యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. జగనన్న స్మార్ట్టౌన్షిప్స్లో రిబేటుపై స్థలాలు కేటాయించామని, 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించామన్నారు. స్థలాల కేటాయింపునకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!