Godavari Flood Down: తగ్గుతున్న గోదావరి వరద.. వీడని లంక వాసుల కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గంటకు ఒక పాయింట్ వంతున నీటిమట్టం తగ్గుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు 37 రోజులుగా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లంకవాసుల వరద కష్టాలు తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ తగ్గుతుంది.
ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతున్న కారణంగా బ్యారేజీ వద్ద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 పాయింట్ 4 అడుగులకు తగ్గింది. గంటకు ఒక పాయింట్ వంతున తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ నుండి 15 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల ప్రజలు, ఊపిరి పీల్చుకుంటున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలోని 4 విలీన మండలాలు, దిగువన కోనసీమ లంక గ్రామాలకు గడిచిన 37 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న చిక్కుకున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. కోనసీమలోని లంక గ్రామాల రహదారులు నీట మునిగాయి. కాజ్వేల్ పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో ప్రస్తుతం పడవలపైనే లంక గ్రామస్తులు ప్రయాణం సాగిస్తున్నారు. గత నెలలో వచ్చిన వరద పూర్తిగా ఇళ్లను సైతం నీట ముంచింది. మళ్ళీ ఇప్పుడు నీటిలో ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
- Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
అధికారులు వరద నీటిమట్టం తగ్గడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. దీనితో నదీ పరివాహక ప్రాంతంలోని వరదలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఎగువన ముంపు మండలాలైన చింతూరు ,కూనవరం, విఆర్ పురం, ఎటపాకలలో అనేక ముంపుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిషా, ఛత్తీస్ ఘడ్ జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బారులు తీరిన లారీలు గత వారం రోజులుగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!