Godavari Flood Down: తగ్గుతున్న గోదావరి వరద.. వీడని లంక వాసుల కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గంటకు ఒక పాయింట్ వంతున నీటిమట్టం తగ్గుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు 37 రోజులుగా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లంకవాసుల వరద కష్టాలు తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ తగ్గుతుంది.
ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతున్న కారణంగా బ్యారేజీ వద్ద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 పాయింట్ 4 అడుగులకు తగ్గింది. గంటకు ఒక పాయింట్ వంతున తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ నుండి 15 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల ప్రజలు, ఊపిరి పీల్చుకుంటున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలోని 4 విలీన మండలాలు, దిగువన కోనసీమ లంక గ్రామాలకు గడిచిన 37 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న చిక్కుకున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. కోనసీమలోని లంక గ్రామాల రహదారులు నీట మునిగాయి. కాజ్వేల్ పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో ప్రస్తుతం పడవలపైనే లంక గ్రామస్తులు ప్రయాణం సాగిస్తున్నారు. గత నెలలో వచ్చిన వరద పూర్తిగా ఇళ్లను సైతం నీట ముంచింది. మళ్ళీ ఇప్పుడు నీటిలో ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
అధికారులు వరద నీటిమట్టం తగ్గడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. దీనితో నదీ పరివాహక ప్రాంతంలోని వరదలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఎగువన ముంపు మండలాలైన చింతూరు ,కూనవరం, విఆర్ పురం, ఎటపాకలలో అనేక ముంపుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిషా, ఛత్తీస్ ఘడ్ జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బారులు తీరిన లారీలు గత వారం రోజులుగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
తాజావార్తలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
-
Virat Kohli : ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ ఆడతాడా? గాయంపై కీలక అప్డేట్!
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
-
Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!