Godavari floods: గోదావరికి రికార్డ్ స్థాయిలో వరద.. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లను దిగ్భందించాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాపల్లిలో.. భూపాలపల్లి, మహాముత్తారం, మహదేవ్పూర్, కాటారం మండలాల్లో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 800 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూడా కూలిపోయాయి.. ఇక, పంట నష్టం అంచనా వేయాల్సి ఉంది.. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వాగులు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో, కొన్ని రోడ్లు కొట్టుకుపోగా.. మరికొన్ని రోడ్లను దాటలేని పరిస్థితి ఉంది.. దీంతో, చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏ జిల్లాలో పరిస్థితి చూసినా అలాగే ఉంది.. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోని ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి..
Read Also: Warangal: 100 శాతానికి మించి వర్షపాతం.. నిండిన చెరువులు
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
ఓవైపు ఆరు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు.. మరోవైపు, ఎగువన కురుస్తోన్న వర్షాలతో మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద పోటెత్తింది.. దీంతో.. ఎన్నడూ లేని విధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.. సాధారణంగా గోదావరికి జూలైలో వరదలు వచ్చినా… లక్ష క్యూసెక్కుల లోపే ఉండేవని గణాంకాలు చెబుతుండగా.. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్ చేశాయి.. 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది.. ఇది క్రమంగా పెరిగిపోతోంది.. ఓవైపు, రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టికి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా వస్తున్న వరద తోడు కావడంతో.. గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక వరకు వెళ్లినా.. వరద ఉధృతి మళ్లీ తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు.. అయితే, ఇవాళ ఉదయం నుంచి మళ్లీ భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. ఎప్పుడైనా మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఇక, వందేళ్ల చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా జూలై నెలలోనే పోలవరం దగ్గర గోదావరికి రికార్డ్ స్థాయి వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పోలవరం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతుండడంతో.. ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. భద్రాచలం నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నుంచి భారీగా ప్రవాహం ఉండడంతో.. క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.01 లక్షల క్యూసెక్కులుగా ఉంది.. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది ఏపీ విపత్తుల సంస్థ .. మొత్తంగా.. తెలంగాణతో పాటు.. ఆంధ్రలోనూ వందేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గోదావరిలో వరద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!