Gas Leakage: అచ్యుతాపురం సెజ్లో విషవాయువు లీకేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లాలో విషవాయువు లీకేజ్ కలవరం కలిగించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (సెజ్)లో మంగళవారం మరోమారు విషవాయువు లీకేజీ (Gas Leakage) కలకలం రేపింది. వస్త్ర కంపెనీలో విష వాయువు లీకైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువుతో ఇబ్బందులు పడిన మహిళలను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Monkeypox: కలవరపెడుతోన్న మంకీపాక్స్.. టెన్షన్పెడుతోన్న కొత్త కేసులు
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ఇదే సెజ్లో రెండు నెలల కిందట గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. మళ్లీ విషవాయువులు వెలువడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. ఇదిలా వుంటే.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ఘటనపై స్పందించారు. అచ్యుతా పురం విషవాయువు లీకేజీపై అధికారులతో మాట్లాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ కాదు విషాద పట్నం.. లోకేష్
మరోవైపు సీఎం జగన్ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. విశాఖలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు.రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతోంది.విశాఖపట్టణంలో జే గ్యాంగ్ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విష రసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.
ఎల్జీ పాలీమర్స్ మరణ మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే, అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో రెండోసారి విషవాయువులు లీకై వందలమంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురి కావడం తీవ్ర ఆందోళన కలిగించింది.ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. కమీషన్లు నెలనెలా అందితే చాలన్నట్టుంది జగన్ పరిపాలన.చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు సీఎం గారూ! వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
సోము వీర్రాజు ఏమన్నారంటే…
అనకాపల్లి బ్రాండిక్స్ కంపెనీలో రసాయన వాయువు లీక్ తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలి. రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు రసాయనాలు లీక్ కావడమేంటీ..? ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా..? కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోంది? స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
CM JaganmohanReddy: జగన్ని కలిసిన టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..