Ganta Srinivasa Rao and Buddha Venkanna: మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.. బెదిరింపుల నుంచి బుజ్జగింపులకు తగ్గారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao and Buddha Venkanna: ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షా సమావేశం వేదికగా సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను.. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడంతో.. ఆయన బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారు అంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం సమీక్ష సమావేశంలో స్పష్టమైన మార్పు కనిపించింది.. ఎమ్మెల్యే లు, మంత్రులకు బెదిరింపుల నుంచి బుజ్జగించే వరకు తగ్గిపోయారని కామెంట్ చేశారు.. మంత్రులను మారుస్తామని స్వయంగా చెప్పిన సీఎం.. ఇప్పుడు వెనక్కి తగ్గారని పేర్కొన్న ఆయన.. సెమీఫైనల్ లో ఫలితాలు చూసి ఖంగుతిన్నారని.. జగన్ సమావేశానికి పార్టీ ముఖ్యమైన ఎమ్మేల్యేలు, ధర్మాన వంటి నేతలు హాజరుకాకపోవడమే నిదర్శనంగా చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే రాలేదు..!
Also Read
- Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
మరోవైపు.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ టైటానికి షిప్ మునిగిపోవడానికి రెడీగా ఉందన్నారు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని.. వైసీపీతోనే భూ స్థాపితం అవుతారంటూ హాట్ కామెంట్లు చేశారు. ఇక, వాళ్ళు వస్తామన్నా ఏ పార్టీ చేర్చుకోదని స్పష్టం చేశారు.. నిన్న సీఎం జగన్ సమావేశానికి వైసీపీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలు కారణమన్న ఆయన.. రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించేది విజయ శంఖారావం సభగా అభిర్ణించారు. కాగా, రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించనున్న సభ.. వియ శంఖారావ సభ కానుందని టీడీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం కోసం రేపు చంద్రబాబు వస్తున్నారు. బూత్ స్థాయి నుంచి నిర్వహించే రివ్యూ పార్టీ పటిష్టతకు కీలకంగా భావిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మార్పుకు నిదర్శనంగా టీడీపీ చెబుతోంది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత అనివార్యమో.. 2024లో టీడీపీ గెలుపు అంతే ఖాయం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇక, వైసీపీ వైఫల్యాలు, నాయకులు సాగించిన దోపిడీపై పోరాటం టీడీపీకి ఉత్తరాంధ్రలో 34స్థానాలను సాధించి పెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!