Honor Killing: ఏపీలో పరువుహత్య.. కూతుర్ని దారుణంగా చంపిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Killed His Daughter In Nandyal District Because Of Extramarital Affair: ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కన్న కూతురినే ఓ తండ్రి అత్యంత కిరాతకంగా చంపేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఆ తండ్రి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న అనే కుమార్తె ఉంది. ఈమెకు 18 నెలల క్రితం గోస్పాడు మండలం జిల్లెల్లకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. తన భర్తతో కలిసి హైదరాబాద్కి వచ్చిన ప్రసన్న.. నగరంలో కాపురం పెట్టింది. అయితే.. భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో ప్రసన్న పుట్టింటికి తిరిగొచ్చింది.
China Bumper Offer: కొత్త జంటలకు చైనా బంపరాఫర్.. నెల రోజులు ఫ్రీ
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
రోజులు గడుస్తున్నా ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లకపోవడంతో.. కాపురానికి వెళ్లాల్సిందిగా దేవేందర్ రెడ్డి చాలాసార్లు నచ్చజెప్పాడు. ఎన్ని గొడవలు జరిగినా, సర్దుబాటు చేసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా పట్టించుకోకుండా ప్రసన్న పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో తండ్రికి అనుమానం వచ్చింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని, అందుకే భర్త వద్దకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉందని అనుమానం కలిగింది. దీంతో.. కూతురిని చంపేయాలని దేవేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 10వ తేదీన రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు.. ప్రసన్న గొంతు నులిమి చంపేశాడు. కొందరి సహాయంతో ప్రసన్న మృతదేహాన్ని నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని పచ్చర్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు.. తల, మొండెను వేరు చేశాడు. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.
Bandi Sanjay: బీఆర్ఎస్ను తరిమికొడదాం.. రామరాజ్యం స్థాపించుకుందాం
ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో.. పాణ్యం పోలీసులు రంగంలోకి దిగారు. కుళ్లి కంపు కొడుతున్న మృతదేహం, శిథిలాలను సేకరించి.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి దేవేందర్ రెడ్డినే కూతుర్ని హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో.. దేవేందర్తో పాటు అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. మరొకరితో తన కూతురు వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తాను చంపేశానని విచారణలో దేవేందర్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!