Perni Nani: మీ రాజకీయం కోసం జనాల్ని బలిచేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ ఆధ్వర్యంలో దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమం. 30 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలు తయారు చేశారని ప్రకటించారు. ఖాళీ లారీలు పెట్టి మోసం చేస్తారా? మీటింగ్ కోసం, స్వచ్చంద సంస్థ పేరు చెప్పి రాక్షస క్రీడ జరపడం దారుణం అన్నారు. డ్రోన్ షాట్ల కోసం ఇలా చేస్తారు. గ్రాఫిక్స్ అలవాటు పడ్డారు. 2014 నుంచి దిక్కుమాలిన జబ్బు చంద్రబాబుకి తగ్గలేదన్నారు. మీ పాపాలు లెక్కకు మిక్కిలి చేస్తున్నారు. మీకు జనాల్ని ఆకర్షించే శక్తి లేదు. కొడుక్కి బాబుమీద నమ్మకం లేదు. కొడుకు పాదయాత్ర పోస్టర్ పై తండ్రి ఫోటో కూడా లేదు. చంద్రబాబు ఫోటో లేకుండా ఇలా చేయడం… బాబుమీద కొడుక్కి మీద నమ్మకం లేదు.. దత్తపుత్రుడి మీద నమ్మకం లేదు. సీపీఐ రామకృష్ణకు ఇష్టం అన్నారు.
జగన్ ని ఓడించడానికి మీరు ఎంతమంది కలిసినా లాభం లేదు. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలంటారు పవన్ కళ్యాణ్, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు అనగానే టీడీపీ మద్దతుదారులు ప్లేట్ ఫిరాయించారు. పేదలకు సహాయం అందించే కార్యక్రమంలో తొక్కిసలాట జరగటం దురదృష్టకరం అని చంద్రబాబు ప్రకటించారు. ఒక దిక్కుమాలిన ప్రెస్ నోట్ ను చంద్రబాబు విడుదల చేశారు. డిసెంబర్ 29న ఆ పార్టీ నాయకుడు శ్రవణ్ కుమార్ చంద్రబాబు పాల్గొనే కార్యక్రమం కోసం పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. పది వేల మందితో బహిరంగ సభ అనే లేఖలో రాశారు.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Also: Ex Minister Perni Nani Press Meet Live: మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లైవ్
బయటేమో 30 వేల మందికి చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం అంటారు. ఘటన తర్వాత ప్లేటు ఫిరాయించి మాకు సంబంధం లేదు అంటున్నారు., ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం అయితే టీడీపీ వాళ్లు ఎందుకు అనుమతికి దరఖాస్తు చేశారు?ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి చంద్రబాబుకు సిగ్గు వేయటం లేదా?? అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వావి వరసలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. మీరేం చేసినా.. ప్రజల గుండెల్లో ఉన్న జగన్ ని అంగుళం కూడా కదపలేరన్నారు పేర్ని నాని.
Read Also: Gautham Gambhir: వన్డేల్లో రోహిత్కు జోడీగా అతడినే ఆడించాలి
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!