Kannababu: మాకు బాలకృష్ణ తక్కువ కాదు.. చిరంజీవి ఎక్కువ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannababu: రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది.. దీనిపై విమపక్షాలు మండిపడుతున్నాయి.. ఇదే సమయంలో.. ఇద్దరు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించారు.. కానీ, ప్రభుత్వ ఆంక్షలతో ఒంగోలులో నిర్వహించే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. మరోవైపు, విశాఖ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మార్పు చేశారు.. ముందుగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర వేదిక ఫిక్స్ చేయగా అక్కడ అధికారుల నుండి అనుమతి రాలేదు. దీంతో ఈ వేదికను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి మార్చారు. అయితే ఇక్కడ నుండి కూడా వేదిక మారిపోయింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆర్కే బీచ్ లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రశ్న ఎదురైంది.. దానిపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. బాలకృష్ణ సినిమా ఫంక్షన్ లను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు..
Read Also: US House Speaker: ఎట్టకేలకు ప్రతినిధుల స్పీకర్గా కెవిన్ మెక్కార్తీ ఎన్నిక
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
చిరంజీవి మూవీ ఫంక్షన్ కి ఆర్కే బీచ్ లో నిబంధనలు ప్రకారం అనుమతులు ఇచ్చి ఉంటారని తెలిపారు కన్నబాబు.. అంతేకానీ, మాకు బాలకృష్ణ తక్కువ, చిరంజీవి ఎక్కువ కాదు.. రోడ్డు మీద సభలు పెట్టకూడదు అనేది జీవో ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇక, గతంలో ముద్రగడ పద్మనాభాన్ని ఏ చట్టం ప్రకారం నిర్బంధించారు, పరామర్శకి వస్తుంటే చిరంజీవిని రాజమండ్రిలో ఎందుకు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు కన్నబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారం కోసం మనుషులు ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు.. జీవో నెంబర్ 1 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబుకి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. అధికార దాహం తప్ప చంద్రబాబుకి ఏమీ లేదని ఆరోపించారు.. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. కందుకూరులో ఎవరు కుట్ర చేశారు.. అలా చెప్పడానికి సిగ్గు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాపులు మీద వేల కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!