CPI Narayana: విజయవాడ మునకకు బుడమేరు కారణం కాదు..!
- విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు..
- నాయకుల తప్పిదం.. పూడిక తీస్తే వరదల ప్రభావం ఉండదు..
- ఆక్రమణల కారణంగా ముంపు..
- ప్రభుత్వాలు చేసే తప్పుడు పనులతో ప్రజలకు ఇబ్బందులన్న నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు.. ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో పర్యటించిన ఆయన.. కొల్లేరును పరిశీలించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. రోడ్లు, మంచినీళ్లు, డ్రైనేజీ సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్తులు.. కాంటూరు పరిధి తగ్గించి తమకు జీవనాధారం కల్పించాలని గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు.. కొల్లేరు పూడిక తీయించి నీటి పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని నారాయణ దృష్టికి తీసుకు వచ్చారు గ్రామస్తులు.. పూడిక తీయకపోవడం వల్ల వరదల సమయంలో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఇక, ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రాయలసీమలో ఎక్కడా నీళ్లు దొరకవు, మహిళలు కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు.. లంక గ్రామాల చుట్టూ నీళ్లు ఉన్నా తాగడానికి చుక్క నీళ్లు లేవు , అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా లంక గ్రామాల పరిస్థితి ఉందన్నారు.. ఆసియాలోనే అతిపెద్ద సరస్సు కొల్లేరు చేపలు పెంచుకోవచ్చు.. ఎలాంటి మందులు వాడకూడదన్నారు.. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో అప్పట్లో కొల్లేరు చెరువులు కొట్టేశారు.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.. నాయకులు ప్రజల బాగు కోసం కాకుండా ఓట్ల కోసం కాంటూరు పరిధి గురించి మాట్లాడారని దుయ్యబట్టారు.. అయితే, విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు అన్నారు. వర్షాలు, నీళ్ళు లేకపోతే బతుకే లేదు.. నీటి ప్రవాహానికి మనం అడ్డుకట్ట వేయకూడదు.. వాటి ప్రవాహాన్ని ఆక్రమనలతో అడ్డుకుంటేనే వరదలు వస్తాయన్నారు.. ముఖ్యమంత్రి చెబితే వినే అవకాశం ఇప్పుడు కేంద్రంలో ఉంది.. బుడమేరు నుంచి కొల్లేరు వరకూ పూడిక తీయాలి, లంక గ్రామాలకు రోడ్లు వేయాలని సూచించారు..
Read Also: IT Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
మరోవైపు.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎర్ర చందనం నిత్యం అక్రమంగా తరలిపోతూనే ఉంటుంది, కానీ, అటవీ శాఖ అధికారులు ఒక లారీ పట్టుకుని.. పది లారీలు వదిలేస్తారు అని ఆరోపించారు నారాయణ.. ఇక్కడ లంక గ్రామాల్లో రోడ్లు వేయాలంటే.. అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు కాదంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుందన్నారు.. కేంద్రంలో చంద్రబాబుకి ప్రస్తుతం అంత పట్టుంది.. కేంద్రంతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేయొచ్చు, పూడికలు తీయడం, ఆక్రమణలు తొలగించడం చేయాలి.. కనీస సమస్యలు లంక గ్రామాల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాస్తాను.. కేంద్రం, రాష్ట్రం రెండూ కలిసి చేయాల్సిన పనులు ఇవి.. మేం ఓట్ల కోసం కాదు… జనం కోసం ఉంటాం 2025 ఫిబ్రవరి ఒకటో తారీకు కల్లా రోడ్లు వెయ్యకపోతే పెనుమాక లంక వెళ్లే దారిలో పోరాటం చేస్తాం.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..