IT Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
- కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు..
- లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్య..
- పదే పదె అరెస్టు మాట కేటీఆర్ సింపతీ కోసమే..
- కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మేము ఏమి కుట్ర చేయడం లేదని క్లారటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Minister Sridhar Babu: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదే పదె అరెస్టు మాట కేటీఆర్ సింపతీ కోసమే అన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మేము ఏమి కుట్ర చేయడం లేదని క్లారటీ ఇచ్చారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. లగచర్ల ఘటనలో.. కలెక్టర్,గ్రూప్ 1 అధికారిని చంపే ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఎవ్వరినీ తప్పుపట్టం… విచారణ జరుగుతుందన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. బీజేపీ – బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియ జరుగుతోందన్నారు.
Read also: CM Chandrababu: నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతన ఆలోచనలు ఉన్నాయి: సీఎం
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఏదో ఒక కేసులో తనను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండడంతో ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు. లగచర్ల ఘటన రాజకీయ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా కేటీఆర్ పాత్రపై నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహం రచించారని, మిగిలిన నిందితులను రెచ్చగొట్టేందుకు తన అనుచరుడు బొమ్మమోని సురేష్ ను ఉపయోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల తండా, లగచర్ల గ్రామాలకు చెందిన రైతులు సురేష్ సహకారంతో రెచ్చిపోయారని, ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు గ్రామస్తులకు అండగా ఉంటారని నివేదికలో పేర్కొన్నారు.
Ashu Reddy : అషూ రెడ్డి అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే.. హీటెక్కించేస్తోంది
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!