Bird Flu: ఏలూరులో ఓ వ్యక్తికి సోకిన బర్డ్ ఫ్లూ..! క్లారిటీ ఇచ్చిన కలెక్టర్
- ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు ప్రచారం..
- కొట్టిపారేసిన జిల్లా కలెక్టర్..
- ఇప్పటి వరకు దేశంలోనే ఎవరికి సోకలేదని క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu: ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలో.. తెలంగాణలోని ఇంకా కొన్ని జిల్లాలో ఇప్పుడు బర్డ్ఫ్లూ టెన్షన్ పెడుతోంది.. ఈ సమయంలో.. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ఫ్లూ సోకినట్టు ప్రచారం జరిగింది.. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని.. కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలిందని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, ఈ వార్తలపై సీరియస్గా స్పందించారు ఏలూరు జిల్లా కలెక్టర్.. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందన్న ఆమె…. అయితే, జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో.. భారత్లోనే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ప్లు కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని స్పష్టం చేశారు.. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కరికి కూడా ఈ వ్యాధి సోకి మరణించిన దాఖలాలు లేవని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్ కె.వెట్రి సెల్వి..
Read Also: Ram Gopal Varma : స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు : రామ్ గోపాల్ వర్మ
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
అయితే, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు అరికట్టవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. ఉంగుటూరు మండలం బాదంపూడిలో పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందన్నారు.. బాదంపూడిలో 10 కిలోమీటర్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. జిల్లా కలెక్టరేట్లో పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందిన కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా పరిగణించాలని.. పది కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్ గా ప్రకటించాలని.. రెడ్ జోన్ పరిధిలో సెక్షన్ 144, సెక్షన్ 133 అమలు చేయాలని.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, కలెక్టరేట్ లో 24/7 హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!