Cyber Fraud: సూర్యాపేట వైద్యాధికారికి సైబర్ కేటుగాళ్ళ బురిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్ళు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మీకు లాటరీ తగిలిందని, మీకు కారు బహమతిగా వచ్చిందని, గిఫ్ట్ కూపన్స్ వచ్చాయని వినియోగదారుల్ని బుట్టలో వేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్ళు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేరుతో ఫేక్ నంబర్ తో వాట్సప్ చాట్ చేసి 1.4 లక్షలకు టోకరా వేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు వైద్యాధికారి ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ( డీఎంహెచ్ఓ ) డాక్టర్ కోటాచలంకి నిన్న జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఫొటోతో ఉన్న 9368435819 నంబర్ నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది.
Read Also: Green India Challange : గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన రమేష్ రెడ్డి
Also Read
మొదటగా యోగ క్షేమాలు అడిగినట్టు నటించి తాను కాన్ఫరెన్స్ మీటింగ్ తో బిజీ గా ఉన్నా. అర్జంట్ గా అమెజాన్ గిఫ్ట్ కూపన్స్ పంపించేది ఉంది తాను తరవాత నగదు పంపిస్తాను అని చెప్పడంతో నిజంగానే కలెక్టర్ అడిగారని భ్రమపడిన డీఎంహెచ్ఓ కోటా చలం వెంటనే రూ.1.40 లక్షల విలువ గల గిఫ్ట్ కూపన్స్ కోసం కేటుగాళ్ళు చెప్పిన నంబర్ కి డబ్బులు పంపించారు. అయినప్పటికీ ఇంకా కూపన్స్ సరిపోలేదు.
తాను బయటకు వచ్చే పరిస్థితి లేనందున ఇంకా 1.20 లక్షలు పంపించాలని అడగడంతో లేటుగా అనుమానించిన కోటా చలం కలెక్టర్ సీసీ కి ఫోన్ చేసి సదరు నంబరుని పోల్చి చూడగా అది కలెక్టర్ గారి నంబర్ కాదని తేలింది. తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు . ఒక వైపు వివిధ రూపాల్లో సైబర్ నెరగాళ్ళు బురిడీ కొట్టించే అవకాశం ఉందని అలెర్ట్ గా ఉండాలని సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు ఇప్పుడు అధికారులకు సైతం అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
Read Also: T20 World Cup: ముగిసిన పాక్ ఇన్నింగ్స్.. భారత్ ముందు 160 లక్ష్యం
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!