ED Raids: గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి.. 27 గంటలపాటు సోదాలు, విచారణ సాగింది.. ఈడీ రైడ్స్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు.. మూడు బ్యాగుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారు అధికాలరు.. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో జరిపిన సోదాల్లో కీలక ఆధారాలను రాబట్టింది ఈడీ.. నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆర్ధిక లావాదేవీల వివరాలను డాక్యుమెంట్లతో సహా స్వాధీనం చేసుకున్నారు.. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి సుమారు రూ. 25 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్టు ఈడీ గుర్తించింది.. ఎంబీబీఎస్, పీజీ సీట్ల ఫీజుల్లో నుంచి నిధులను కొందరు డైరెక్టర్లు మళ్లించినట్టు ఈడీకి ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది.. ఇక, భవనాల నిర్మాణం పేరుతో రూ. 4 కోట్ల మేర నిధులు మళ్లించారని తేల్చారు..
Read Also: NPCI: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం , ఫ్రీచార్జ్ వాడుతున్నారా? అయితే మీకు ఊరట..
పలువురు ఎన్ఆర్ఐలు పన్ను రాయితీల కోసం విదేశాల్లో ఇచ్చిన విరాళాలను ఇక్కడ కొందరు డైరెక్టర్లు డ్రా చేసుకున్నట్టు ఈడీ సోదాల్లో గుర్తించారు.. రికార్డుల్లోకి కోవిడ్ పేషంట్ల వివరాలు పోందుపర్చకుండా నిధులను మళ్లించారన్న అంశంపై ఈడీ పక్కా ఆధారాలు చిక్కాయి.. 1500కు పైగా రోగుల నుంచి రూ.30 కోట్లకు నగదు పక్కదారి పట్టినట్టు తేల్చారు.. ఈడీ సోదాల్లో కొందరు డైరెక్టర్ల తెర వెనుక బినామీ బాగోతాలు కూడా వెలుగుచూశాయి.. ఓ డైరెక్టరుకు బినామిలుగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారట.. దళితుల పేర్లతో అప్పులు తీసుకున్నారట సదురు డైరెక్టర్… తీసుకున్న రుణంతో గిడ్డంగులు నిర్మించారని సమాచారం. సుమారు రూ. 40 కోట్ల మేర అప్పులు తిరిగి చెల్లించలేదని ఈడీ సోదాల్లో బినామీ బాగోతం బయటపడింది.. ఈ వ్యవహరం అంతా ఓ బినామీ కంపెనీ పేరుతో లావాదేవీలు జరిపినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.. మాన్యువల్, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.. కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషంట్ల వివరాలు రికార్డుల్లో చేర్చలేదని ఈడీ గుర్తించింది. అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఆర్ఐ నిధులతో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ వైద్య పరికరాలు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తే.. మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు ఈడీ అధికారులు.