Margani Bharat: బాబు షూరిటీ ఎక్కడ ఉందని ప్రజలు అడుగుతున్నారు..
- బాబు షూరిటీ ఏదని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారు..
- ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు..
- రెడ్ బుక్ పేరుతో లోకేష్ రెచ్చగొడితే.. టీడీపీ శ్రేణుల దాడులు: మార్గాని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాజమండ్రిలో జరిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. రీ కాలింగ్ చంద్రబాబూస్ మానిఫెస్టో అని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ అమలు చేయని హామీల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. బాబు షూరిటీ ఏదని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సింగయ్య అనే వ్యక్తి చనిపోతే.. ఏఐ వీడియో రూపొందించి జగన్ కారు కింద పడినట్లు అధికార పార్టీ నేతలు చూపించారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై ఏదో రకంగా కేసులు పెట్టీ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని అన్నారు. బులెట్ ప్రూఫ్ కారు మెడ ఎక్కితే అసలు మెడే ఉండదని వివరించారు.. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో రెచ్చి పోయి.. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మార్గాని భరత్ విమర్శించారు.
Read Also: Nehal Modi: పీఎన్బీ బ్యాంకు మోసం కేసు, అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్..
Also Read
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
అలాగే, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. జగన్ అంటే నిజం చంద్రబాబు అంటే అబద్ధం అని విమర్శించారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికి లబ్ది చేకూర్చిన నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. పేద వాళ్లని ఉద్దరించడానికే వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు.. కరోనా సమయంలో వాలంటీర్ల వ్యవస్థను దేశమంతా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. విషాహారం తిన్న పిల్లలను నేలపై కూర్చోబెట్టి వైద్యం అందించిన దౌర్భాగ్య స్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు. చేసింది.. చెప్పిన వారి కంటే వేస్తానని చెప్పిన వారిని జనం నమ్మి మోసపోయారని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
తాజావార్తలు
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
-
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
-
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
-
Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!