East Godavari : ప్యారడేజ్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు, కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాజమండ్రిలో ప్యారడేజ్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న హోటల్ నుండి చికెన్ తీసుకుని వచ్చి రాజమండ్రి హోటల్ లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వినియోగదారుడు పెమ్మనబోయిన రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు పై అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేశారు. అయితే హైదరాబాద్ నుండి హోటల్ కు దిగుమతి చేసుకుని తయారుచేసిన చికెన్ టిక్కా, బిర్యానీ శాంపిల్స్ ను అధికారులు సేకరించారు.
ఆహార కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ డి.శ్రీనివాస్ హెచ్చరించారు. హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఎవరైనా ఆహార కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. తూనికలు, కొలతల శాఖ ఇన్స్ఫెక్టర్ శివ బాలాజీ మాట్లాడుతూ కోక్ డ్రింక్ కొలతల్లో తేడా గమనించామని, దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..