Kartika Masam: కార్తీక మాసం చివరి సోమవారం ఎఫెక్ట్.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
- కార్తీక మాసం చివరి సోమవారం..
- శివాలయాల్లో భక్తుల రద్దీ..
- గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి..
- తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తుల పుణ్యస్నానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Masam: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
Read Also: Neck Guards: ఏం ఐడియా గురూ.. .. పులులు బారి నుంచి రక్షించుకోవడం కోసం..
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా పవిత్ర కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, కుండలేశ్వరం పార్వతీ కుండలేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వృద్ధ గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, గోదావరిలో కార్తీకదీపాలను వదిలారు. అనంతరం మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
మరోవైపు, ప్రకాశం జిల్లా పొదిలిలో కార్తీకమాసం సందర్భంగా మండలంలో అయ్యప్ప స్వామి పడి పూజలు ఘనంగా అంగరంగ వైభవం గా నిర్వహించారు.. మండలంలోని కాటూరి వారి పాలెం, పొదిలి అచ్చిరెడ్డి నగర్ లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించి భజనలు చేశారు.. భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలలో పాల్గొన్నారు.. సకల దేవత పాటలు పాడుతూ స్వామివారి సేవలో మునిగిపోయారు.. ఈ కార్యక్రమంలో పొదిలి మండలం మరిపూడి మండలం కొనకలమిట్ల మండలం నుండి సకల మాలాధారణ చేసిన స్వాములు ఇప్పటిపూజ మహోత్సవ పాల్గొని స్వామివారి కృపను పొందారు.. అనంతరం పడిపూజ నిర్వాహకులు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు.. ఇంకా మండలంలో భారీ పడిపూజలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పొదిలి అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు..
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!