Purandeswari: కేంద్రం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఊరట
- రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం
- ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన దగ్గుపాటి పురంధేశ్వరి
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్- పురంధేశ్వరి
- వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు- పురంధేశ్వరి.
రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు. ధన ధాన్య యోజన పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పప్పు దినుసులు దిగుమతి పెంచుకునేందుకు బడ్జెట్లో ఆలోచించారని పేర్కొన్నారు. మరోవైపు.. ఆక్వా రంగానికి, పాడి పశువులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
పంట నష్టపోయినా.. ఇంట్లో ఉన్న పాడి పశువుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి గోకుల్ పథకం అందిస్తున్నట్లు పురంధేశ్వరి చెప్పారు. మరోవైపు.. పెట్టుబడి సేకరణకు ప్రత్యేక దృష్టి పెట్టారని, దేశంలో పెట్టుబడులు పెడితే రక్షణ ఉంటుందని తెలిపారు. పెట్టుబడులు రావడానికి మన రాష్ట్రానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచమంతా ఆర్థికమాన్యం ఎదురుకుంటున్నా.. మనదేశం 7 శాతం అభివృద్ధిలో ఉందని పేర్కొన్నారు. రోజుకు రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మరోవైపు.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఊరట లభించిందన్నారు. ప్రపంచానికి అవసరమైన మందులను తయారు చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉంది.. జన ఔషధ పథకం, ఆయుష్ మాన్ భారత్ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
తాజావార్తలు
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!