Purandeswari: కేంద్రం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఊరట
- రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం
- ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన దగ్గుపాటి పురంధేశ్వరి
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్- పురంధేశ్వరి
- వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు- పురంధేశ్వరి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు. ధన ధాన్య యోజన పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పప్పు దినుసులు దిగుమతి పెంచుకునేందుకు బడ్జెట్లో ఆలోచించారని పేర్కొన్నారు. మరోవైపు.. ఆక్వా రంగానికి, పాడి పశువులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
Also Read
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
పంట నష్టపోయినా.. ఇంట్లో ఉన్న పాడి పశువుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి గోకుల్ పథకం అందిస్తున్నట్లు పురంధేశ్వరి చెప్పారు. మరోవైపు.. పెట్టుబడి సేకరణకు ప్రత్యేక దృష్టి పెట్టారని, దేశంలో పెట్టుబడులు పెడితే రక్షణ ఉంటుందని తెలిపారు. పెట్టుబడులు రావడానికి మన రాష్ట్రానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచమంతా ఆర్థికమాన్యం ఎదురుకుంటున్నా.. మనదేశం 7 శాతం అభివృద్ధిలో ఉందని పేర్కొన్నారు. రోజుకు రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మరోవైపు.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఊరట లభించిందన్నారు. ప్రపంచానికి అవసరమైన మందులను తయారు చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉంది.. జన ఔషధ పథకం, ఆయుష్ మాన్ భారత్ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!