PVN Madhav: రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరింది.. మాధవ్ ఫైర్
- రాహుల్ గాంధీ నైతికంగా దిగజారి పోయారు..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఫైర్..
- రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరింది..
- అందుకే ప్రధాని తల్లి పై రాహుల్ అనుచితి వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVN Madhav: కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ నైతికంగా దిగజారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచితి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంటూ అంటూ ఫైర్ అయ్యారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాధవ్.. రాహుల్ గాంధీని తరిమికొడతామని హెచ్చరించారు.. ఎన్నికల కమిషన్ విసిరిన సవాల్ కు రాహుల్ గాంధీ తోకముడిచారి కామెంట్ చేశారు.. మోడీ తల్లిపై అనుచితి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు.
Read Also: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఇక, కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడించారు మాధవ్.. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి షెకావత్ అధ్యయనం చేశారని తెలిపారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పుష్కరాలు నిర్వహిస్తాయన్నారు.. గోదావరి పుష్కరాలు పేరుతో రాజమండ్రిలో శాశ్వత కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తామని, దీనిలో భాగంగా హేవలాక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. దేశంలో మోడీ పరిపాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే చాయ్ పే చర్చ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల నుండి అనుహ్యా స్పందన లభిస్తుందని అన్నారు పీవీఎన్ మాధవ్.. కాగా, అంతకు ముందు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం యాత్ర చేపట్టారు. రాజమండ్రి ఏకేసీ కాలేజ్, ఎన్టీఆర్ పార్క్ వద్ద స్థానికులతో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో మోడీ పరిపాలన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను పలువురు మాధవ్ దృష్టికి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!