PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
- పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్
- షెహబాజ్ షరీఫ్ను పట్టించుకోని ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా జరుగుతున్న ఎస్సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
చైనా వేదికగా సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ముందుగా దేశాధినేతలంతా గ్రూప్ ఫొటో దిగారు. ఆయా దేశాధినేతలంతా వరుసగా నిలబడ్డారు. వరుస క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీ తన స్థానంలో నిలబడేందుకు షెహబాజ్ షరీఫ్ను దాటుకుని వెళ్లాలి. కానీ మోడీ మాత్రం పాక్ ప్రధాని వైపే చూడలేదు. పుతిన్తో ఏదో మాట్లాడుతున్నట్లుగా దాటుకుని వెళ్లిపోయారు. ఇక గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా షెహబాజ్ షరీఫ్తో మాట్లాడేందుకు కూడా మోడీ ఇష్టపడలేదు. పుతిన్-జిన్పింగ్తో సంభాషిస్తూ.. పాక్ ప్రధాని వెళ్లిపోగానే వారి వెనుక నెమ్మదిగా మోడీ వెళ్లారు.ఇక మోడీ-పుతిన్-జిన్పింగ్ చాలా కులాసాగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా సేపు నవ్వుకుంటూ సంభాషించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 26 మందిని మతం పేరుతో పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా వీసాలను రద్దు చేసింది. అటరీ సరిహద్దు నిలిపివేసింది. ఇక మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదలను హతం చేయగా.. అలాగే పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో అమెరికాతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-రష్యా-చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సరిహద్దు ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్లారు.

తాజావార్తలు
-
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
-
US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!