PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
- పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్
- షెహబాజ్ షరీఫ్ను పట్టించుకోని ప్రధాని మోడీ
చైనా వేదికగా జరుగుతున్న ఎస్సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
చైనా వేదికగా సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ముందుగా దేశాధినేతలంతా గ్రూప్ ఫొటో దిగారు. ఆయా దేశాధినేతలంతా వరుసగా నిలబడ్డారు. వరుస క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీ తన స్థానంలో నిలబడేందుకు షెహబాజ్ షరీఫ్ను దాటుకుని వెళ్లాలి. కానీ మోడీ మాత్రం పాక్ ప్రధాని వైపే చూడలేదు. పుతిన్తో ఏదో మాట్లాడుతున్నట్లుగా దాటుకుని వెళ్లిపోయారు. ఇక గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా షెహబాజ్ షరీఫ్తో మాట్లాడేందుకు కూడా మోడీ ఇష్టపడలేదు. పుతిన్-జిన్పింగ్తో సంభాషిస్తూ.. పాక్ ప్రధాని వెళ్లిపోగానే వారి వెనుక నెమ్మదిగా మోడీ వెళ్లారు.ఇక మోడీ-పుతిన్-జిన్పింగ్ చాలా కులాసాగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా సేపు నవ్వుకుంటూ సంభాషించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 26 మందిని మతం పేరుతో పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా వీసాలను రద్దు చేసింది. అటరీ సరిహద్దు నిలిపివేసింది. ఇక మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదలను హతం చేయగా.. అలాగే పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో అమెరికాతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-రష్యా-చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సరిహద్దు ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్లారు.

తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!