PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
- పాక్ ప్రధాని షెహబాజ్కు మోడీ బిగ్ షాక్
- షెహబాజ్ షరీఫ్ను పట్టించుకోని ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా జరుగుతున్న ఎస్సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
చైనా వేదికగా సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ముందుగా దేశాధినేతలంతా గ్రూప్ ఫొటో దిగారు. ఆయా దేశాధినేతలంతా వరుసగా నిలబడ్డారు. వరుస క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీ తన స్థానంలో నిలబడేందుకు షెహబాజ్ షరీఫ్ను దాటుకుని వెళ్లాలి. కానీ మోడీ మాత్రం పాక్ ప్రధాని వైపే చూడలేదు. పుతిన్తో ఏదో మాట్లాడుతున్నట్లుగా దాటుకుని వెళ్లిపోయారు. ఇక గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా షెహబాజ్ షరీఫ్తో మాట్లాడేందుకు కూడా మోడీ ఇష్టపడలేదు. పుతిన్-జిన్పింగ్తో సంభాషిస్తూ.. పాక్ ప్రధాని వెళ్లిపోగానే వారి వెనుక నెమ్మదిగా మోడీ వెళ్లారు.ఇక మోడీ-పుతిన్-జిన్పింగ్ చాలా కులాసాగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా సేపు నవ్వుకుంటూ సంభాషించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 26 మందిని మతం పేరుతో పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా వీసాలను రద్దు చేసింది. అటరీ సరిహద్దు నిలిపివేసింది. ఇక మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదలను హతం చేయగా.. అలాగే పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో అమెరికాతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-రష్యా-చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సరిహద్దు ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్లారు.

తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..