Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Manikya Vara Prasad Fires On Opposition Parties Over Amaravati Lands: అమరావతి లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ళ స్థలాలను కొందరు పెద్దలు, భూస్వాములు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదల పక్షాన పోరాటం చేస్తాననే స్ట్రాంగ్ సీఎం జగన్ ఒక్కరేనని, అందుకే పేదలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామన్నప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకించారన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు పేదల పట్ల వ్యతిరేఖ భావజాలంతో ఉన్నారని ఆరోపణలు చేశారు. మరి, ఇది అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పేదల పక్షాన నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పేదల పక్షాన ఉంటారా.. పెత్తందారుల పక్షాన ఉంటారా? అని అడిగారు. గతంలో ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన రాజధాని తెచ్చుకున్నారని.. అయినా అయినా మంగళగిరి, తాడికొండలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఇళ్ల స్థలాలు అనేది పెత్తందారుల వాదన అని చురకలంటించారు.
Health Tips Telugu : చికెన్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!
Also Read
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు!
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
అంతకుముందు.. 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇచ్చామన్నారు. పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారని, పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోందని, ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
-
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
-
East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
-
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్లో మాస్ ర్యాగింగ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..