Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Manikya Vara Prasad Fires On Opposition Parties Over Amaravati Lands: అమరావతి లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ళ స్థలాలను కొందరు పెద్దలు, భూస్వాములు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదల పక్షాన పోరాటం చేస్తాననే స్ట్రాంగ్ సీఎం జగన్ ఒక్కరేనని, అందుకే పేదలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామన్నప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకించారన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు పేదల పట్ల వ్యతిరేఖ భావజాలంతో ఉన్నారని ఆరోపణలు చేశారు. మరి, ఇది అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పేదల పక్షాన నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పేదల పక్షాన ఉంటారా.. పెత్తందారుల పక్షాన ఉంటారా? అని అడిగారు. గతంలో ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన రాజధాని తెచ్చుకున్నారని.. అయినా అయినా మంగళగిరి, తాడికొండలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఇళ్ల స్థలాలు అనేది పెత్తందారుల వాదన అని చురకలంటించారు.
Health Tips Telugu : చికెన్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
అంతకుముందు.. 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇచ్చామన్నారు. పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారని, పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోందని, ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!