Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Manikya Vara Prasad Fires On Opposition Parties Over Amaravati Lands: అమరావతి లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ళ స్థలాలను కొందరు పెద్దలు, భూస్వాములు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదల పక్షాన పోరాటం చేస్తాననే స్ట్రాంగ్ సీఎం జగన్ ఒక్కరేనని, అందుకే పేదలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామన్నప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకించారన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు పేదల పట్ల వ్యతిరేఖ భావజాలంతో ఉన్నారని ఆరోపణలు చేశారు. మరి, ఇది అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పేదల పక్షాన నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పేదల పక్షాన ఉంటారా.. పెత్తందారుల పక్షాన ఉంటారా? అని అడిగారు. గతంలో ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన రాజధాని తెచ్చుకున్నారని.. అయినా అయినా మంగళగిరి, తాడికొండలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఇళ్ల స్థలాలు అనేది పెత్తందారుల వాదన అని చురకలంటించారు.
Health Tips Telugu : చికెన్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!
Also Read
- Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అంతకుముందు.. 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇచ్చామన్నారు. పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారని, పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోందని, ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..