Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Doctors Negligence In Eluru District

Doctors Negligence: డాక్టర్ల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

Published Date :July 22, 2022 , 3:43 pm
By NTV WebDesk
Doctors Negligence: డాక్టర్ల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. ఓ డాక్టర్ నిర్లక్ష్యం తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు చనిపోయింది. నిర్దాక్షిణ్యంగా నవజాత శిశువును పురిటిలోనే చంపేశారు డాక్టర్లు. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం కావుపాడు ప్రభుత్వ  ఆసుపత్రి డాక్టర్ నిర్వాకం బయటపడింది. డాక్టర్ ,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పురిటిలోనే కన్నుమూసింది నవజాత శిశువు. ఉంగుటూరు మండలం కావుపాడు గ్రామానికి చెందిన మేరీరత్నం 9నెలల గర్భిణీ. ఆమెకు సకాలంలో వైద్యం అందక కడుపులోనే మృతి చెందింది శిశువు.

డాక్టర్ల నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణం అంటున్నారు బంధువులు. అయితే, తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. యువతికి పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు బంధువులు. సాధారణ ప్రసవం చేస్తామని ఆపరేషన్ థియేటర్‌కి తరలించి, గర్భిణీని అనేక ఇబ్బందులు పెట్టి నార్మల్ డెలివరీ చేస్తున్నామనే నెపంతో శిశువు తలకు తీవ్ర గాయాలు చేశారని గర్భిణి బంధువులు ఆరోపించారు.

Also Read

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
  • AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
  • Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

ప్రసవ సమయంలోనే శిశువును బయటకు తీసే సమయంలోనే శిశువు తలను బాగా నలిపివేశారని అందుకే తలకు తీవ్ర గాయాలయ్యాయని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ప్రసవ సమయంలోనే శిశువు చనిపోయిందని గ్రహించాడు డాక్టర్. ఏమి చేయాలో తెలియక ఆపరేషన్ మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు డ్యూటీ డాక్టర్. డెలివరీ మధ్యలోనే డాక్టర్ ఎందుకు వెళుతున్నారని బంధువులు అడగగా  మాట్లాడకుండా అక్కడ నుంచి ఉడాయించాడా డ్యూటీ డాక్టర్. డాక్టర్ వెళ్లిపోవడంతో యువతి బంధువులను హడావుడి పెట్టి, అర్జెంటుగా తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించాలని డాక్టర్ చెప్పారని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళాలని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

చేసేదిలేక వెంటనే అక్కడి నుంచి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు బంధువులు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తాడేపల్లిగూడెం ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఎటూ పాలుపోని పరిస్థితిలో గర్భిణిని కాపాడు కొనేందుకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు బంధువులు. ఆపరేషన్ చేసి చనిపోయిన శిశువును బయటకు తీసేశారు డాక్టర్లు. అయితే ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉందని, నాలుగు రోజులు గడిస్తే గాని ఏమీచెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావుపాడు ప్రభుత్వ  ఆసుపత్రి డాక్టర్ నిర్వాకం కారణంగానే శిశువు చనిపోయిందని,డాక్టర్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Maganti Gopinath : టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు మధ్య సెగలు రేపుతున్న రగడ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • kavupadu phc
  • lady serious
  • neonatal child died
  • pregnant lady

తాజావార్తలు

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions