DL Ravindra Reddy: ఏపీ ప్రభుత్వంపై డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు.. పార్టీ మారబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DL Ravindra Reddy: కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు. అయితే తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని, కానీ వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
1978 నుంచి డీఎల్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1978లో మైదుకూరు నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. కానీ గత ఎన్నికల ముందు టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కానీ చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేదు. దీంతో డీఎల్ వైసీపీలో చేరి మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం పనిచేశారు. ప్రస్తుతం డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబును పొగడటం బట్టి చూస్తే ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
Read Also: Free Smart Phone: బంపర్ ఆఫర్.. కామెంట్ చేయండి.. ఉచితంగా స్మార్ట్ ఫోన్ పొందండి..!!
అయితే డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎల్ వెన్నుపోటు నేత అని.. వెన్నుపోటు పొడిచే డీఎల్ను ఎవరూ నమ్మే పరిస్థితులు లేవని కౌంటర్ ఇచ్చారు. డీఎల్ ఏ పార్టీలో చేరినా వెన్నుపోటు పొడుస్తాడని.. ఆయన్ను టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఏ పార్టీ కూడా ఆయన్ను చేర్చుకునే సాహసం చేయవని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. జగన్ పుట్టినరోజు నాడే జగన్పై ఆరోపణలు చేయడానికి డీఎల్కు సిగ్గుండాలని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..