Dhulipalla Narendra: ఏపీలో పశువుల దాణా తరహా కుంభకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని పశువుల దాణా కుంభకోణం తరహాలోనే ఏపీ ప్రభుత్వం మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యనించారు. ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడుని అమ్ముడుతున్నారని, అది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? అని ప్రశ్నించారు. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్ను మెట్రిక్ టన్ను రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ.. ఆ కంపెనీ సరఫరా చేసే మేతనే కొనుగోలు చేయాల్సిందిగా రైతులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రజలు గతంలో మునుపెన్నడూ చూడని నరకాన్ని మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చూపిందని నరేంద్ర దుయ్యబట్టారు. సీఎం జగన్ నెలకు ఒక్కసారైనా సచివాలయానికి కూడా రావడం లేదని, జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీని చాలా సంక్షోభాలు తాకాయని విమర్శించారు. ఈ మూడేళ్ళలో ప్రత్యేక హోదా సాధనకు జగన్ ఏం చేశారని నిలదీశారు. జగన్ సీఎం అయ్యాక ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి కానీ.. రైతు అమ్ముకునే ధాన్య ధర పెరగలేదన్నారు. ఈ ప్రభుత్వం పంటల బీమాను గాలికొదిలేసిందని, పంట విలువ కంటే తక్కువకే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తోందన్నారు. నామమాత్రంగా బీమా చేస్తూ రైతుల్ని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పంట విస్తీర్ణం పెరిగి, దిగుబడి తగ్గిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయని.. 11 శాతం దిగుబడి తగ్గిందని సర్కార్ గణంకాలే స్పష్టం చేస్తున్నాయని నరేంద్ర వివరించారు.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ అమలు చేసినదాన్ని తామేందెకు కట్టాలని చెప్పిన జగన్ ప్రభుత్వం.. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ ఎలా అమలు చేస్తారని నరేంద్ర ప్రశ్నించారు. గులాబ్, జవాద్ వంటి విపత్తుల్లో 9.52 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, ఒక్క పైసా కూడా ప్రభుత్వం విదల్చలేదన్నారు. పశువులు చనిపోతే డబ్బులుస్తామన్న ప్రభుత్వం.. సుమారు రూ. 100 కోట్లు పెండింగులో పెట్టిందన్నారు. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహించారు. ఏపీలో అమలయ్యేలా పథకాల్లో 60 శాతం కేంద్ర నిధులతోనే చేపడుతున్నారని.. మరి ఆ పథకాల్లో మోదీ ఫోటోని వాడుతున్నారా? అంటూ ధూళిపాళ నరేంద్ర ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!