Dhulipalla Narendra: ఏపీలో పశువుల దాణా తరహా కుంభకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని పశువుల దాణా కుంభకోణం తరహాలోనే ఏపీ ప్రభుత్వం మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యనించారు. ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడుని అమ్ముడుతున్నారని, అది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? అని ప్రశ్నించారు. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్ను మెట్రిక్ టన్ను రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ.. ఆ కంపెనీ సరఫరా చేసే మేతనే కొనుగోలు చేయాల్సిందిగా రైతులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రజలు గతంలో మునుపెన్నడూ చూడని నరకాన్ని మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చూపిందని నరేంద్ర దుయ్యబట్టారు. సీఎం జగన్ నెలకు ఒక్కసారైనా సచివాలయానికి కూడా రావడం లేదని, జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీని చాలా సంక్షోభాలు తాకాయని విమర్శించారు. ఈ మూడేళ్ళలో ప్రత్యేక హోదా సాధనకు జగన్ ఏం చేశారని నిలదీశారు. జగన్ సీఎం అయ్యాక ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి కానీ.. రైతు అమ్ముకునే ధాన్య ధర పెరగలేదన్నారు. ఈ ప్రభుత్వం పంటల బీమాను గాలికొదిలేసిందని, పంట విలువ కంటే తక్కువకే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తోందన్నారు. నామమాత్రంగా బీమా చేస్తూ రైతుల్ని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పంట విస్తీర్ణం పెరిగి, దిగుబడి తగ్గిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయని.. 11 శాతం దిగుబడి తగ్గిందని సర్కార్ గణంకాలే స్పష్టం చేస్తున్నాయని నరేంద్ర వివరించారు.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ అమలు చేసినదాన్ని తామేందెకు కట్టాలని చెప్పిన జగన్ ప్రభుత్వం.. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ ఎలా అమలు చేస్తారని నరేంద్ర ప్రశ్నించారు. గులాబ్, జవాద్ వంటి విపత్తుల్లో 9.52 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, ఒక్క పైసా కూడా ప్రభుత్వం విదల్చలేదన్నారు. పశువులు చనిపోతే డబ్బులుస్తామన్న ప్రభుత్వం.. సుమారు రూ. 100 కోట్లు పెండింగులో పెట్టిందన్నారు. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహించారు. ఏపీలో అమలయ్యేలా పథకాల్లో 60 శాతం కేంద్ర నిధులతోనే చేపడుతున్నారని.. మరి ఆ పథకాల్లో మోదీ ఫోటోని వాడుతున్నారా? అంటూ ధూళిపాళ నరేంద్ర ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!