Dharmana Prasada Rao: రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టిస్తున్నారు.. ఇది చంద్రబాబు ఎత్తుగడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao Fires On Chandrababu Naidu: ఒక రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టిస్తున్నారని.. ఇది చంద్రబాబు ఎత్తుగడేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని వెనుక ఉన్న దురుద్దేశాలను తాము బయటపెట్టామని, అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ కూడా జరిగిందని అన్నారు. అనుభవాలతో పాటు వాస్తవాలను కూడా తెలిపామన్నారు. హైదరాబాద్ను విడదీయడాన్ని వద్దని రాష్ట్ర ప్రజలు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. గడిచిన 65 సంవత్సరాలు పెట్టుబడి అంతా హైదరాబాద్లోనే పెట్టామని, అభివృద్ధి అక్కడే జరిగిందని, అందుకే తెలంగాణ వారు రాష్ర్ట విభజన కోరుకున్నారని చెప్పారు. ఒకవేళ రాష్ర్ట నలుములలా అభివృద్ధి జరిగి ఉంటే.. ప్రత్యేక తెలంగాణ కోరేవారు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగిన పని, మళ్లీ జరగదని ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.
మరోసారి ఉత్తరాంధ్రను పొమ్మంటే మరింత వెనుకబడతామని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు మరుగున పెట్టారని నిలదీశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ఎందుకు ఒకే ప్రాంతంపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారని అడిగారు. ఆయన ఆలోచనలో స్వార్థం ఉంది కాబట్టే, అమరావతిపై ఫోకస్ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు స్నేహితులు, బందువుల చేత భూములకు కేటాయింపు చేశారని ఆరోపణలు చేశారు. దొనకొండ, నూజవీడుని కాదని.. రాజధాని ప్రాంతాన్ని ఎందుకు దాచిపెట్టారన్నారు. వైఎస్ జగన్గానీ, ఈ ప్రభుత్వం గానీ అమరావతి వద్దని చెప్పలేదని.. ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని నిలదీశారు. విశాఖ క్యాపిటల్ వద్దంటే ఎందుకు ఊరుకుంటామన్నారు. 23 కేంద్ర సంస్థలు వస్తే.. ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదని వెల్లడించారు. రైతుల మాటున ప్రజల రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ.. నోరు నొక్కితే తాము ఊరుకునేదే లేదని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!