Dadisetti Raja: యనమలపై దాడిశెట్టి ఫైర్.. దమ్ముంటే రావాలని సవాల్
Dadisetti Raja Fires On Yanamala Ramakrishnudu: యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెంనాయుడు సీఎం పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారని, పార్టీలో తానం నంబర్ 2 అని చెప్పుకునే యనమల అందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. యనమల ఇలాగే అబద్ధాలు మాట్లాడితే.. వాస్తవాలు చూపించి మరీ చెప్పు తీసుకొని కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుని దురదృష్టంకొద్దీ మహా మేధావి యనమల ఇక్కడ పుట్టాడంటూ దుయ్యబట్టారు. విద్యావ్యవస్థ గురించి యనమల అవాకులు, చవాకులు పేలుతున్నాడని.. నీ విమర్శలకి ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని మండిపడ్డారు.
Kriti Verma: కృతి మెడకు ఉచ్చు.. అడ్డంగా బుక్ చేయించిన రిలేషన్షిప్
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
రాష్ట్రంలో ఉన్న విద్యావ్యవస్థను ఫాలో అవుతూ.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని దాడిశెట్టి స్పష్టం చేశారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించిందని.. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చామని అన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. యనమల స్వగ్రామమైన ఏవీ నగరంలో స్కూల్స్ కోసం ఏకంగా రూ.1 కోటి 60 లక్షలు ఖర్చు పెట్టామని.. అవసరమైతే నీ ఇంటికొచ్చి నిరూపిస్తానని, దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. అసందర్భ ప్రేలాపనలు, పచ్చి అబద్దాలు యనమల మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా లేవని.. కానీ ఇప్పుడు స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని.. నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు.
Paytm: పేటీఎంకు అలీబాబా షాక్..పెట్టుబడులు ఉపసంహరణ
హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరని యనమల మాట్లాడుతున్నారని.. విద్యా వ్యవస్థ గురించి ఆయనలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి రాజా పేర్కొన్నారు. బెండపూడి స్టూడెంట్స్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలియజేశారు. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. లోకేష్ ఒక బఫూర్ అని, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పాదయాత్రకు ప్రజాదరణ లేకపోయినా.. ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
Minister KTR : కేంద్రం చేయాల్సిన పని చేయకుండా మాకు ఉపదేశాలు ఇస్తే ఎలా
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!