Narayana: చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం.. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమగా మారింది.. కొందరు స్టార్లు ఓపెన్గా ప్రభుత్వాన్ని విమర్శంచడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయిపోయింది.. కొందరు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్లడాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నేత నారాయణ.
Read Also: Surya Kumar Yadav: రెండో వన్డే: సూర్యకుమార్ వరల్డ్ రికార్డు…
Also Read
ఫిల్మ్ ఛాంబర్కు, నిర్మాతల మండలికి సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్.. కేవలం చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు నారాయణ.. విభజించు.. పాలించు అనే విధానం సరికాదని సూచించిన ఆయన.. ఉద్యోగుల సమస్యల్లోనూ ప్రభుత్వం విభజించు.. పాలించు అనే విధానం అనుసరించిందని ఫైర్ అయ్యారు.. ఇక, ఉద్యోగుల సమస్యలలాగే సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం మేనేజ్ చేయాలని చూస్తోందని ఆరోపించారు నారాయణ.. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. మేనేజ్ చేసే వ్యవహారం మంచిది కాదని.. మా, ఫిల్మ్ ఛాంబర్ని కూడా చర్చలకు పిలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, గతంలోనూ వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై స్పందించిన నారాయణ.. చిరంజీవి ఒంటరిగా సీఎంను కలవడం ఆయన చేసిన పొరపాటని పేర్కొన్నారు.. చిరంజీవి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటి. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదుగా అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!