Cotton Price: బంగారంలా మెరిసిపోతున్న పత్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది.
కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు తరలి వస్తుంది. ఈ మార్కెట్ లో ఏటా 20 లక్షల క్వింటాళ్ల పత్తి, 10 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ లావాదేవీలు జరుగుతాయి. పత్తి ఎపితోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదోని మార్కెట్ కు తీసుకువస్తారు. ఈ మార్కెట్ లో వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. దూదిని తమిళనాడు, పత్తి గింజలు మధ్యప్రదేశ్ , గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు రవాణా చేస్తారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
ప్రస్తుతం పత్తి ధర భగ్గుమంటోంది. క్వింటాలు 13 వేలకు పైమాటే ఉంది. 2020-21 లో 12 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ రాగా 2021-22 లో 6 లక్షల క్వింటాలు మాత్రమే వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ లో దూది, పత్తి గింజాలకు డిమాండ్ పెరగడం, విస్తీర్ణం తగ్గడంతో ధర విపరీతంగా పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి క్రమంగా పత్తి ధర పెరుగుతూ వచ్చింది. 2022 జనవరి లో క్వింటాలు పత్తి 10 వేల మార్కు దాటింది. అదే ఎక్కువ ధర అనుకుంటే 2022 మార్చి నాటికి క్వింటాలు పత్తి రూ.12,500 కు చేరింది. ఈ ఏడాది మే నాటికి క్వింటాలు పత్తి 13,400 మార్కు దాటింది. సుమారు 6 నెలలుగా పత్తి ధర పైపైకి ఎగబాకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆదోని మార్కెట్ యార్డు చరిత్రలో ఇది అత్యధిక ధరగా చెబుతారు. అంతర్జాతీయ మార్కెట్ లో దూది, పత్తి గింజలకు డిమాండ్ పెరగడం, భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 6 క్వింటాలకు మించలేదు. దీంతో ధర కూడా పెరిగింది. దిగుబడి తగ్గినా ధర దాదాపు రెట్టింపు కావడంతో రైతులకు దిగుబడిలో నష్టం కనిపించడం లేదు. ధర పెరగడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు పత్తి రైతులు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!