Cotton Price: బంగారంలా మెరిసిపోతున్న పత్తి
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది.
కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు తరలి వస్తుంది. ఈ మార్కెట్ లో ఏటా 20 లక్షల క్వింటాళ్ల పత్తి, 10 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ లావాదేవీలు జరుగుతాయి. పత్తి ఎపితోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదోని మార్కెట్ కు తీసుకువస్తారు. ఈ మార్కెట్ లో వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. దూదిని తమిళనాడు, పత్తి గింజలు మధ్యప్రదేశ్ , గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు రవాణా చేస్తారు.
Also Read
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
- Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ప్రస్తుతం పత్తి ధర భగ్గుమంటోంది. క్వింటాలు 13 వేలకు పైమాటే ఉంది. 2020-21 లో 12 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ రాగా 2021-22 లో 6 లక్షల క్వింటాలు మాత్రమే వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ లో దూది, పత్తి గింజాలకు డిమాండ్ పెరగడం, విస్తీర్ణం తగ్గడంతో ధర విపరీతంగా పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి క్రమంగా పత్తి ధర పెరుగుతూ వచ్చింది. 2022 జనవరి లో క్వింటాలు పత్తి 10 వేల మార్కు దాటింది. అదే ఎక్కువ ధర అనుకుంటే 2022 మార్చి నాటికి క్వింటాలు పత్తి రూ.12,500 కు చేరింది. ఈ ఏడాది మే నాటికి క్వింటాలు పత్తి 13,400 మార్కు దాటింది. సుమారు 6 నెలలుగా పత్తి ధర పైపైకి ఎగబాకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆదోని మార్కెట్ యార్డు చరిత్రలో ఇది అత్యధిక ధరగా చెబుతారు. అంతర్జాతీయ మార్కెట్ లో దూది, పత్తి గింజలకు డిమాండ్ పెరగడం, భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 6 క్వింటాలకు మించలేదు. దీంతో ధర కూడా పెరిగింది. దిగుబడి తగ్గినా ధర దాదాపు రెట్టింపు కావడంతో రైతులకు దిగుబడిలో నష్టం కనిపించడం లేదు. ధర పెరగడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు పత్తి రైతులు.
తాజావార్తలు
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!