Cotton Price: బంగారంలా మెరిసిపోతున్న పత్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది.
కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు తరలి వస్తుంది. ఈ మార్కెట్ లో ఏటా 20 లక్షల క్వింటాళ్ల పత్తి, 10 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ లావాదేవీలు జరుగుతాయి. పత్తి ఎపితోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదోని మార్కెట్ కు తీసుకువస్తారు. ఈ మార్కెట్ లో వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. దూదిని తమిళనాడు, పత్తి గింజలు మధ్యప్రదేశ్ , గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు రవాణా చేస్తారు.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ప్రస్తుతం పత్తి ధర భగ్గుమంటోంది. క్వింటాలు 13 వేలకు పైమాటే ఉంది. 2020-21 లో 12 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ రాగా 2021-22 లో 6 లక్షల క్వింటాలు మాత్రమే వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ లో దూది, పత్తి గింజాలకు డిమాండ్ పెరగడం, విస్తీర్ణం తగ్గడంతో ధర విపరీతంగా పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి క్రమంగా పత్తి ధర పెరుగుతూ వచ్చింది. 2022 జనవరి లో క్వింటాలు పత్తి 10 వేల మార్కు దాటింది. అదే ఎక్కువ ధర అనుకుంటే 2022 మార్చి నాటికి క్వింటాలు పత్తి రూ.12,500 కు చేరింది. ఈ ఏడాది మే నాటికి క్వింటాలు పత్తి 13,400 మార్కు దాటింది. సుమారు 6 నెలలుగా పత్తి ధర పైపైకి ఎగబాకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆదోని మార్కెట్ యార్డు చరిత్రలో ఇది అత్యధిక ధరగా చెబుతారు. అంతర్జాతీయ మార్కెట్ లో దూది, పత్తి గింజలకు డిమాండ్ పెరగడం, భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 6 క్వింటాలకు మించలేదు. దీంతో ధర కూడా పెరిగింది. దిగుబడి తగ్గినా ధర దాదాపు రెట్టింపు కావడంతో రైతులకు దిగుబడిలో నష్టం కనిపించడం లేదు. ధర పెరగడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు పత్తి రైతులు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!