Hyderabad MMTS: తగ్గిన ప్రయాణికులు.. రద్దైన రైళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 29న (ఆదివారం) ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి.
రద్దయిన మార్గాల్లో సిటీ బస్సులు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయిన మార్గాల్లో అదనంగా సిటీ బస్సులు నడుపాలని అధికారులు నిర్ణయించారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు (22), సికింద్రాబాద్ నుంచి హైటెక్సిటీ (54), సికింద్రాబాద్ నుంచి బోరబండ (16), చాంద్రాయణగుట్ట నుంచి పటాన్చెరు (108), సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు (84) వరకు అదనపు బస్సులు నడుస్తాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు.
ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడం.. కొద్ది సమయంలోనే గమ్యస్థానానికి చేరడంతో.. ప్రతి ఒక్క ప్రయాణికులు మెట్రోకే పరుగులు పెడుతున్నారు. రెండు మూడు స్టాపుల్లోనే గమ్యం రావడంతో ప్రయాణికులు మెట్రోకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎంఎంటీఎస్ కు ప్రయాణికులు తగ్గారని నగరవాసుల టాక్.. ఉదయం 6 గంటల నుంచి మెట్రో అందుబాటులో వుండి రాత్రి 11 గంటలకు మెట్రో సేవలందించడంతో ప్రయాణికులంతా మెట్రోలో ప్రయాణించేందుకే ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది. దీంతో ఎంఎంటీఎస్ కు రద్దీ తక్కువైందని పలువురు భావిస్తున్నారు. దీనివల్లే ఎంఎంటీఎస్ ప్రయాణికులు తగ్గారని దీనివల్లే ఎంఎంటీఎస్ రైళ్లు రద్దైనట్లు తెలుస్తోంది.
రద్దైన రైళ్లు ఇవే..
లింగంపల్లి- హైదరాబాద్ మధ్య నడిచే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 నెంబర్ల రైళ్లు రద్దయ్యాయి.
హైదరాబాద్ లింగంపల్లి మధ్య 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 సర్వీసులను రద్దు చేశారు.
ఫలక్నుమా – లింగంపల్లి మధ్య 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నెంబర్ల రైళ్లు నేడు అందుబాటులో ఉండవు.
లింగంపల్లి – ఫలకూమా మధ్య 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 రైళ్లను రద్దు చేశారు.
కింద్రాబాద్ – లింగంపల్లి మధ్య 47150 సర్వీసు నేడు అందుబాటులో ఉండదు.
లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య 47195 సర్వీసును రద్దు చేశారు.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!