ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్.. రాములవారి కల్యాణం కూడా ఏకాంతంగానే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రా భద్రాద్రి గా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది..రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తూ కేంద్ర పురావస్తుశాఖ మరియు టీడీటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..అయితే ఈ నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన ఒంటిమిట్ట రాములవారి కల్యాణం సైతం భక్తులు లేకుండా ఏకాంతంగా జరపాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది..రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి..ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడిచే కడప ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండో భద్రాద్రి గా పేరు పొందిన ఒంటిమిట్ట దేవాలయంలో ఈ నెల 21 నుంచి 29 వరకు కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరగాల్సి ఉంది..కానీ కోవిడ్ నిబంధనల పేరుతో ఆలయం నేటి నుంచి మే నెల 15 తేదీ వరకు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు…కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగానే స్వామివారి కల్యాణం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు…కేంద్ర పురావస్తుశాఖ మరియు టిటిడి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు…వాస్తవానికి సీతారామ కళ్యాణ మహోత్సవానికి గతంలో 5 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నారు…కానీ కరోనా రోజు రోజుకూ విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ఏకాంత సేవలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..26వ తేదీన స్వామివారి కల్యాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నారని సమాచారం.
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
ఈ మేరకు ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేకుండా ఈనెల 21 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు,ఆలయం లోపల ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంతంగా నిత్య కైంకర్యాలు జరుపనున్నారు…ఒంటిమిట్ట రామాలయం తో పాటు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం, పుష్పగిరి ఆలయాలను కూడా మూసివేసారు…గత ఏడాది కూడా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రవేశం లేకుండా ఏకాంతంగానే నిర్వహించారు..తిరిగి ఈ యేడాది కూడా కోవిడ్ మూలంగా ఆలయంలో ఏకాంతంగా జరుపనుండడంతో భక్తులు నిరుత్సాహం చెందుతున్నారు. ఏది ఏమైనా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం చూసేందుకు భక్తులకు ఈ ఏడాది కూడా అవకాశం లేకపోవడంతో నిరాశా చెందుతున్నారు..
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!