ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్.. రాములవారి కల్యాణం కూడా ఏకాంతంగానే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రా భద్రాద్రి గా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది..రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తూ కేంద్ర పురావస్తుశాఖ మరియు టీడీటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..అయితే ఈ నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన ఒంటిమిట్ట రాములవారి కల్యాణం సైతం భక్తులు లేకుండా ఏకాంతంగా జరపాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది..రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి..ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడిచే కడప ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండో భద్రాద్రి గా పేరు పొందిన ఒంటిమిట్ట దేవాలయంలో ఈ నెల 21 నుంచి 29 వరకు కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరగాల్సి ఉంది..కానీ కోవిడ్ నిబంధనల పేరుతో ఆలయం నేటి నుంచి మే నెల 15 తేదీ వరకు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు…కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగానే స్వామివారి కల్యాణం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు…కేంద్ర పురావస్తుశాఖ మరియు టిటిడి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు…వాస్తవానికి సీతారామ కళ్యాణ మహోత్సవానికి గతంలో 5 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నారు…కానీ కరోనా రోజు రోజుకూ విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ఏకాంత సేవలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..26వ తేదీన స్వామివారి కల్యాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నారని సమాచారం.
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
ఈ మేరకు ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేకుండా ఈనెల 21 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు,ఆలయం లోపల ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంతంగా నిత్య కైంకర్యాలు జరుపనున్నారు…ఒంటిమిట్ట రామాలయం తో పాటు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం, పుష్పగిరి ఆలయాలను కూడా మూసివేసారు…గత ఏడాది కూడా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రవేశం లేకుండా ఏకాంతంగానే నిర్వహించారు..తిరిగి ఈ యేడాది కూడా కోవిడ్ మూలంగా ఆలయంలో ఏకాంతంగా జరుపనుండడంతో భక్తులు నిరుత్సాహం చెందుతున్నారు. ఏది ఏమైనా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం చూసేందుకు భక్తులకు ఈ ఏడాది కూడా అవకాశం లేకపోవడంతో నిరాశా చెందుతున్నారు..
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!