Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Controversy At Agri Land Farmer Self Destruction

Farmer Incident: మట్టికట్ట తెచ్చిన వివాదం.. రైతు బలవన్మరణం

Published Date :August 7, 2022 , 9:12 pm
By NTV WebDesk
Farmer Incident: మట్టికట్ట తెచ్చిన వివాదం.. రైతు బలవన్మరణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పొలంలో వేసుకున్న మట్టికట్ట ఆ రైతు ప్రాణాలమీదకు తెచ్చింది… అలా అవుతుందని అతను ఊహించి వుండడు. వరదనీరు పోవడం లేదంటూ అధికారులు పొలం మట్టికట్ట తొలగించేందుకు ప్రయత్నిచారు… పోలీసులతో రైతును అడ్డుకోవడంతో మనస్తాపం చెందాడు… పోలీసుల సమక్షంలోనే పురుగు మందు తాగిన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.మట్టికట్ట తవ్వేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు, పోలీసులను అడ్డుకున్నాడు నందకిషోర్. అతనిది పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు. నందకిషోర్ కు గ్రామంలో 11ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో ఆరెకరాలు సాగు చేస్తున్నాడు. మిగతా ఐదెకరాలు పల్లంలో ఉంది. దీంతో గ్రామంలోని కళింగవాగు పొంగితే పల్లంలో ఉన్న ఐదెకరాల పొలం నీటమునిగిపోతుంది. దీంతో సాగుకు ఇబ్బందిగా మారింది. నాలుగు నెలల క్రితం తన పొలం ముంపుకు గురికాకుండా ఐదులక్షలు ఖర్చుపెట్టి పొలం చుట్టూ మట్టికట్ట ఏర్పాటు చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కళింగవాగుకు వరదనీరు వచ్చి చేరింది.

నందకిషోర్ పొలం వద్ద ఉన్న చప్టాపైనుంచి నీరు ప్రవహించింది. పొలానికి వేసిన మట్టికట్ట వల్ల వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని అధికారులు భావించారు. వాగు పక్కనే ఉన్న పోరంబోకు స్థలం తవ్వితే వరదనీరు పోతుందని నందకిషోర్ కుటుంబం అధికారులకు చెప్పింది. నాలుగు రోజుల క్రితం మట్టికట్ట తవ్వడానికి వచ్చిన అధికారులను నందకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ పొలంలో వేసుకున్న మట్టికట్టను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కు వెళ్లిపోయారు. మళ్లీ పోలీసులతో వచ్చిన రెవెన్యూ అధికారులు మట్టికట్ట తొలగించేందుకు సిద్దమయ్యారు. అధికారుల ప్రయత్నాన్ని గమనించిన నందకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

మట్టికట్ట తొలగించేందుకు వచ్చిన ప్రొక్లైనర్ కు అడ్డంగా కూర్చుకున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా నందకిషోర్ తమ్ముడు, మేనత్త, కుటుంబ సభ్యులను పక్కకు లాగేశారు. మనస్తాపానికి గురైన నందకిషోర్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే నందకిషోర్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నందికిషోర్ మృతిచెందాడు. తన అన్న మృతికి అధికారుల తీరే కారణమని మండిపడుతున్నారు.

మరోవైపు రాజకీయ కారణాలతోనే తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న మట్టికట్ట తొలగించేందుకు ప్రయత్నించారని నందకిషోర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తాము తెలుగుదేశం పార్టీకి చెందినవారని అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటున్నారు. తమ పొలంలో వేసుకున్న మట్టికట్ట తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఒకవేళ మట్టికట్ట తొలగించాలంటే ముందుగా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. నందకిషోర్ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరించి రైతు మృతికి కారణమైన వారిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు, పోలీసులపై కేసులు నమోదు చెయ్యాలని ఫిర్యాదు చేస్తామంటున్నారు. మట్టి కట్ట తొలగింపు వివాదంతో రైతు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

NGT On Kakinada Mada Forest: మడ అడవుల తొలగింపుపై.. ఎన్జీటీ ఆగ్రహం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agruculture land
  • andhrapradesh
  • farmer died
  • Guntur
  • revenue officers

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions