Lanka Dinakar: రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని కాంగ్రెస్ చూస్తోంది..!
- వికసిత భారత్ కోసం మోడీ.. వికసిత్ ఆంధ్ర కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు..
- రాహుల్ గాంధీ కుట్రలను బీజేపీ కమల వ్యూహం పాశుపతాస్త్రంతో ఛేదిస్తుంది..
- రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని కాంగ్రెస్ చూస్తోంది: లంకా దినకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు. అశాస్త్రీయ రాష్ట్ర విభజన, అస్తవ్యస్తమైన ఏపీ పునర్విభజన చట్టం వెనుక జైరాం రమేష్, చిదంబరం ఉన్నారు.. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావిస్తే.. పోలవరం బాధ్యత మాది అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6, 94 లో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం చేశారు.. కంటి తుడుపు కమిటి తప్ప స్పష్టంగా రాష్ట్రానికి ఏమి ఇవ్వాలో తెలుపకుండా బ్లాక్ చెక్ ఇచ్చారు.. అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వడంలో కేంద్రం వెనుకంజ వేయలేదు అని లంక దినకర్ తెలిపారు.
Read Also: Jishnu Dev Varma: నేడే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Off The Record: కాపు రిజర్వేషన్స్ పై ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలనుకున్నారా..!
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్పై కీలక ఆదేశాలు..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
ఇక, ఏపీ రాజధాని నిర్మాణం కోసం అందించే 15 వేల కోట్ల రూపాయల ప్రభావం 50 నుంచి 60 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది అని ఏపీ బీజేపీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రాజధానిని చెల్లని చెక్కు చెయ్యాలని తల్లి కాంగ్రెస్ చూస్తే.. పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించింది.. ఏపీ పునర్విభజనలో నిర్దిష్టంగా ఏ ప్రాజెక్టును సానుకూలంగా పూర్తి చేసేలా చట్టం తయారు చేయలేదు.. కనీస నగదు నిల్వను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోశారు.. 2024- 25 బడ్జెట్ లో కోపర్తి- ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బడ్జెట్ 2024 – 25 విశ్లేషణలో అబద్దాలతో రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని చూసారు.. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు తప్పుడు ప్రచారం చేశారు.. మహాభారతంలో పాండవుల పైన కౌరవులు చక్రవ్యూహం పన్నారు.. నేడు దేశ, రాష్ట్ర అభివృద్ధి ఆపడానికి తల్లి, పిల్ల కాంగ్రెస్లు చక్రవ్యూహం పన్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కానీ పాలనలో వివక్ష చూడకుండా అంత్యోదయ స్పూర్తితో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారు అని లంకా దినకర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!