Odisha Train Accident: ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికుల వివరాలు వెల్లడించిన కలెక్టర్ ఢిల్లీ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Delhi Rao Revealed The Details Of Telugu Passengers in Odisha Train Accident: కోరమాండల్, యశ్వంత్పూర్ రైళ్లలో ప్రయాణించిన తెలుగు ప్రయాణికుల వివరాల్ని కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో విజయవాడకు 135 మంది ప్రయాణికులు రావాల్సిందని స్పష్టం చేశారు. ఇందులో 80 మంది క్షేమంగా బయటపడ్డారని, ఏడుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. 11 మంది ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండగా, 9 మంది అందుబాటులో లేరని తెలియజేశారు. మరో 22 మంది మాత్రం ప్రయాణం చేయలేదని చెప్పారు. వారితో పాటు మరో నలుగురు కాంటాక్ట్లో లేరని, ఫోన్ చేయగా అవి రాంగ్ నంబర్లుగా తేలాయని అన్నారు. ఇక యశ్వంతపూర్-హౌరా రైలులో విజయవాడ నుంచి మొత్తం 41 మంది ప్రయాణికులు వెళ్లారని, అందులో నుంచి 21 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు ఆఖరి నిమిషంలో తమ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకున్నారన్నారు. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండగా, మరో ఇద్దరివి రాంగ్ నెంబర్లుగా తేలాయన్నారు. 8 మంది ఫోన్కాల్స్కి రెస్పాండ్ అవ్వడం లేదని, మరో నలుగురు అందుబాటులో లేరని అన్నారు. ఒక వ్యక్తి టిక్కెట్ కన్ఫమ్ అయినా.. ప్రయాణం చేయలేదని కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు.
Botsa Satyanarayana: ఏపీ నుంచి ఎవరూ చనిపోలేదు.. ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స
Also Read
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- OTR : ఉండిలో వైసీపీకి వరుస ఓటములు? ఐదోసారి ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ!
- Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
కాగా.. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశాలోని రైలు పట్టాలపై మరణమృదంగం మోగింది. సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా.. యశ్వంతపూర్-హౌరా ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండ్ ఎక్స్ప్రెస్, గూడ్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 290 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 1000 మందికి పైగా గాయాపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం.. తమ రాష్ట్ర ప్రజలకు తక్షణ సహాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ గంటకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడికి మంత్రి అమర్నాథ్తో పాటు పలువురు అధికారుల్ని పంపించారు. గాయాలపాలైన వారిని, చనిపోయిన వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
తాజావార్తలు
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
-
Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!