Botsa Satyanarayana: ఏపీ నుంచి ఎవరూ చనిపోలేదు.. ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Pressmeet On Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా స్పందించారు. ఈ విషయంపై సీఎం జగన్ నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందన్నారు. ఈ ప్రమాదం ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. వారిని తీసుకురావాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్తో పాటు ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశాకు పంపించామన్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్లో మొత్తం 482 మంది తెలుగు వారు ప్రయాణించినట్లు తమకు సమాచారం అందిందని.. వారి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. అయితే.. 76 మంది వివరాలు ఇంకా ట్రేస్ అవ్వలేదని చెప్పారు. యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లో 89 మంది తెలుగు వారు ప్రయాణిస్తున్నారని, ఆ 89 మందితోనూ అధికారులు మాట్లాడుతున్నారని తెలియజేశారు.
Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
Also Read
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
తాము అన్ని కలెక్టరేట్లలోనూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని మంత్రి బొత్స వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు.. ఇచ్చాపురం నుంచి బోర్డర్లో ఉన్న అన్ని హాస్పిటల్స్ను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్, మొత్తంగా 65 అంబులెన్స్లను పంపించామని చెప్పారు. ఎయిర్పోర్టులో ఒక చాపర్ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నావి సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ ఒడిశా రైలు ప్రమాదంలో.. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొందరు గాయపడినట్లు మాత్రమే తమకు సమాచారం అందిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి.. సీఎం జగన్ ప్రతీ గంటకు సమీక్షిస్తున్నారని, అధికారులకు ఆయా ఆదేశాలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగు వారికి ఒడిశాలోనూ ట్రీట్మెంట్ అందించేందుకు గాను అన్ని చర్యలు చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
కాగా.. శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే! షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ కోచ్లు పట్టాలు తప్పడంతో.. అవి ఎదురుగా ఉన్న ట్రాక్పై పడ్డాయి. అనంతరం బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్.. పట్టాలు తప్పిన ఆ కోచ్లను ఢీకొనడంతో, దీని కోచ్లు కూడా పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో గూడ్సు రైలు కూడా చిక్కుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మందికి పైగా మృతి చెందగా, 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని శనివారం ప్రధాని మోడీ పరిశీలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్కు శుభవార్త.. సాయి సుదర్శన్కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!