Adimulapu Suresh: సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్.. జగన్ పాలనే మా పబ్లిసిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: సీఎం వైఎస్ జగనే బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీ.. ఏపీలో కల్పిస్తున్న వసతులే మా మంత్రం అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఉన్న నమ్మకమే కారణంగా చెప్పుకొచ్చారు.. అందుకే సీఎం జగనే మా బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీగా అభివర్ణించారు.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యంగా తెలిపారు.. పెట్టుబడిదారుల సదస్సు ఉద్యోగ కల్పన లక్ష్యంతో ముందుకు తీసుకోపోవడం జరిగిందని వెల్లడించారు.. ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.
Read Also: Anand Mahindra: వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. మీరు కూడా నీటిపై పరుగెత్తవచ్చు..!
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
గత పాలకులు పేపర్లకే పరిమితం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సురేష్. ప్రతిపక్షాలు దీనిపై కూడా రాజకీయం చేస్తున్నాయని.. కానీ, అభివృద్ధి, సంక్షేమాన్ని మా ప్రభుత్వం రాజకీయం కోసం వాడలేదని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా అందరికి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.. ప్రతిపక్షాలు మూడు సార్లు సమ్మిట్లు పెట్టి ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో చర్చకి మేం సిద్ధం అంటూ సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా, మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో.. భారీగా పెట్టుబడులు రాబట్టకలిగింది వైఎస్ జగన్ సర్కార్.. జీఐఎస్ వేదికగా కీలక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం.. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న కాలంలో రాష్ట్రంలో 6 లక్షల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నమాట.
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!