YS Jagan: గడప గడపకు ప్రభుత్వం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం… గడప గడపకూ మన ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి మంత్రి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన ఆయన.. ఎవరైనా పథకాలు అందలేదంటే వారికి ఓపిగ్గా వివరణ ఇవ్వాలన్నారు. కొంతమంది ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అని పరోక్షంగా ప్రస్తావించిన సీఎం జగన్.. టీడీపీ మీడియాలో వచ్చే వార్తల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Read Also: Viral: ఎయిర్పోర్టులో తప్పించుకున్న శునకం.. సిబ్బందికి చుక్కలు..!
Also Read
దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు లేవన్నారు సీఎం వైఎస్ జగన్.. అర్హులకు పథకాలు అందకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఓట్లతో సంబంధం లేదు… మనం ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు జనానికి చెప్పాలని సూచించారు. లబ్ధిదారులకు ఇప్పటివరకూ ఎంత మేలు చేశామో లెక్కలు చెప్పాలన్న ఆయన.. జనంలో ఉంటే మీరే గెలుస్తారని స్పష్టం చేశారు. కాగా, సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇల్లులూ తిరుగుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను.. వనగూరిన ప్రయోజనాలను వివరిస్తున్నారు.
తాజావార్తలు
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..