CM YS Jagan and Chandrababu Delhi Tour: ఏపీ నేతల హస్తిన బాట.. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, రాత్రికి సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష నేతలు ఢిల్లీ బాట పట్టారు.. విషయం ఏదైనా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు.. ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు టీడీపీ ఎంపీలు.. మొదట ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం 12.15 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ తో మర్యాదపూర్వకంగా భేటీకానున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి టీడీపీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.. మరోవైపు.. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుండగా.. ఆ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు… తిరిగి రాత్రి 8.15 గంటల సమయంలో హైదరాబాద్కు బయల్దేరనున్నారు.
Read Also: Andhra Girl Married American Guy: ఖండాంతరాలు దాటిన ప్రేమ… అమెరికా అబ్బాయితో తిరుపతి యువతి పెళ్లి..
Also Read
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
ఇక, ఇవాళ రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.. సమావేశం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం కానున్న ఆయన.. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, తన ఢిల్లీ పర్యటనలో సీఎం ఇంకా ఎవరైనా కలుస్తారా? రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు.. సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అయితే, ఒకేరోజు ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నా.. వైఎస్ జగన్ ఢిల్లీలో ల్యాండ్ కాకముందే.. చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!