CM YS Jagan and Chandrababu Delhi Tour: ఏపీ నేతల హస్తిన బాట.. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, రాత్రికి సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష నేతలు ఢిల్లీ బాట పట్టారు.. విషయం ఏదైనా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు.. ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు టీడీపీ ఎంపీలు.. మొదట ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం 12.15 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ తో మర్యాదపూర్వకంగా భేటీకానున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి టీడీపీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.. మరోవైపు.. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుండగా.. ఆ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు… తిరిగి రాత్రి 8.15 గంటల సమయంలో హైదరాబాద్కు బయల్దేరనున్నారు.
Read Also: Andhra Girl Married American Guy: ఖండాంతరాలు దాటిన ప్రేమ… అమెరికా అబ్బాయితో తిరుపతి యువతి పెళ్లి..
Also Read
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
ఇక, ఇవాళ రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.. సమావేశం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం కానున్న ఆయన.. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, తన ఢిల్లీ పర్యటనలో సీఎం ఇంకా ఎవరైనా కలుస్తారా? రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు.. సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అయితే, ఒకేరోజు ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నా.. వైఎస్ జగన్ ఢిల్లీలో ల్యాండ్ కాకముందే.. చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!