థర్డ్ వేవ్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 ద్వారా పిల్లలకు చికిత్స 24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్ టెలీ సేవలు తీసుకు రావాలని..అలాగే 150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలని… ఎయిమ్స్లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వామ్యం చేయాలని.. అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి వారికి బెడ్లు ఇప్పించాలని తెలిపారు.
read also : టీపీసీసీ ఇక…తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ : వైసీపీ ఎంపీ
Also Read
దీనికి అనుగుణంగా వ్యవస్థను బలోపేతం చేయాలని.. కోవిడ్ యేతర కేసులకూ 104 ద్వారా ఈ పద్ధతుల్లో సేవలు అందాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. సీజనల్ వ్యాధులకూ 104 కాల్సెంటర్ ద్వారా సేవలు అందాలని… విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్గా వ్యవహరించాలన్నారు. ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలని… ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ రెండూ ఉండేటట్లు రన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!