CM Jagan : వాల్మీకి/ బోయలకి సీఎం జగన్ దీపావళి గిఫ్ట్
వాల్మీకి/ బోయ ఒరియా బెంతు కులాలకు చెందిన ప్రజల కళ్ళల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు. ఏళ్లుగా పరిష్కారం కాని అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చి వారం రోజుల ముందే వారికి దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. వాల్మీకి/ బోయ ఒరియా బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్ గత 20 ఏళ్లుగా ఉంటోంది. కానీ ఏ ప్రభుత్వము పట్టించు కోలేదు. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో ఆయా కులాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై నివేదిక సమర్పించేందుకు కమిషన్ నియమించారు. ఇటీవలే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పార్టీ క్యాడర్ తో సమావేశంలో ఈ అంశం తెర మీదకు వచ్చింది. సమావేశం జరుగుతుండగా క్యాడర్ వాల్మీకి / బోయ ఒరియా బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చాలనే అంశం తెర మీదకు తెచ్చారు. సదరు అంశంపై పూర్తిగా చర్చించిన సీఎం జగన్ తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి సీఎం జగన్ క్యాడర్ కు ఇచ్చిన హామీ మేరకు కేవలం వారం రోజుల్లో కమిషన్ నియమించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏక సభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ నేతృత్వంలోని ఈ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది వాల్మీకి/ బోయ, ఒరియా బొంతు కులాలు ఉన్నట్లు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్టీ హోదా తో పాటు వాల్మీకి / బోయలు రాజధానిలో వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దింతో పాటు రాజధానిలో వాల్మీకి భవన్ నిర్మించాలని కోరారు. ఎస్టీ హోదా కోసం ఎంపీలు పార్లమెంట్ లో చర్చించేలా చూడాలని కోరారు. క్యాడర్ నుంచి వచ్చిన డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
కర్ణాటకలో ఎస్టీ హోదా..
వాల్మీకి / బోయ ఒరియా బెంతు కులాలకు కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీ హోదా ఉంది. అక్కడ బీసీ లిస్ట్ లో ఉన్న ఈ కులాలకు ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాని ఏపీలో ఈ కులాలు బీసీ లుగా పరిగణలోకి తీసుకోబడుతున్నాయి. కారణం ఎస్టీ హోదా రావాలంటే సదరు కులాలు, వర్గాలకు చెందిన తెగలు అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించేవిగా లెక్కకడతారు. కాని వాల్మీకి / బోయలు పల్లపు ప్రాంతంలో నివసిస్తున్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీటికి ఎస్టీ హోదా దక్కక పోవడానికి ఇది ప్రధాన కారణంగా ఉంటోంది.
- Tags
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?