Mla Bhumana Karunakar Reddy: తన కమిట్మెంట్ మరోసారి చాటుకున్న జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తను కోల్పోయిన మహిళకు రాష్ట్ర సచివాలయ వ్యవస్థలోనే తొలి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించి ప్రజల పట్ల ప్రభుత్వానికున్న కమిట్మెంట్ ను మరోసారి చాటుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర సచివాలయ వ్యవస్థలోనే మొట్ట మొదటి సారిగా కారుణ్య నియామకం కింద రామకుప్పం మహిళ ఉద్యోగ అవకాశం దక్కించుకున్నారు వసంత భాయ్. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గం, రామకుప్పం ప్రాంతానికి చెందిన మోహన్ నాయక్….భూమన కరుణాకర రెడ్డి సొంత నియోజకవర్గమైన తిరుపతి, జీవకోన ప్రాంత సచివాలయంలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందారు. దీంతో మోహన్ నాయక్ భార్య వసంత భాయ్ కుంగిపొయారు. ఊరుకాని ఊరులో తన భర్తను పోగొట్టుకున్న బాధతో కన్నీరు మున్నీరయ్యేలా విలపించారు.
Read Also: Super Star: కృష్ణను పట్టించుకోని వారి గురించి ఏం అనుకోవాలి!?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
భర్త లేకపోవడం, ఉద్యోగం రాకపోవడంతో ఆమె కుటుంబ పోషణ భారంగా మారింది. తన బాధను ఎవరికి చెప్పుకొవాలో దిక్కు తోచనిస్థితి ఆమెది. ఇలా ఇబ్బంది పడుతున్న తరుణంలోనే తాను నివాసం ఉంటున్న జీవకోన వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని కలిసి తన కష్టాన్ని చెప్పుకున్నారు. తమ ఇంటి వద్దకే విచ్చేసిన భూమన కరుణాకర రెడ్డికి తన కష్టాన్ని వివరించారు. తనకు సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు చలించి పోయిన భూమన కరుణాకర రెడ్డి వెంటనే స్పందించి అనంతపురం రీజియన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టెర్ తో ఫొన్లో మాట్లాడారు.
మీకు వేల వేల ధన్యవాదాలు.. వసంత భాయ్
వసంతభాయ్ కి ఉద్యోగం వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫైళ్లను సిద్దం చేయాల్సిందిగా నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలికి ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడంతో వసంతా భాయ్ కి జీవకోన సచివాలయంలో అడ్మిన్ ఉద్యోగం దక్కింది. అనతికాలం లోనే ఉద్యోగం రావడంతో వసంత ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ తనకు స్వాంతన చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్ని విధాలా సహాయం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి రుణపడి ఉంటామన్నారు.
తన భర్త చనిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ని కలిసి వివరించానని, ఆయన వెంటనే స్పందించి అనంతపురం రీజియన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ తో మట్లాడి, తనకు ఉద్యోగం ఇప్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిని చాలా వేగంగా స్పందించారని, చక,చకా ఫైళ్లను సిద్దం చేశారన్నారు. రామకుప్పం నివాసి అయిన తనకు తిరుపతిలో ఉద్యోగం వస్తుందని ఊహించలేదన్నారు. ముత్యాల రెడ్డి పల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న భూమన కరుణాకర రెడ్డిని, నగర మేయర్ శిరీష ను దుశ్శాలువలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు వసంత భాయ్.
Read Also: Anantapur Arts College: అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం.. లెక్చరర్ పై కత్తితో దాడి
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!