CM Jagan: సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల భేటీ.. వారిని నమ్మొద్దన్న ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Comments After Meeting With AP Employees Leaders: మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పలు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన వారితో పలు విషయాలపై చర్చలు జరిపారు. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు. అటు.. ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో తీసుకున్న జీపీఎస్, కేటినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా.. జీపీఎస్ అమలు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
Also Read
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, తద్వారా ప్రజలూ సంతోషంగా ఉంటారని అన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి.. ప్రతీ కార్యక్రమం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్తే.. ఆ వ్యక్తుల్ని నమ్మొద్దని, వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు.
Earthquake In Jammu: జమ్మూకశ్మీర్లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు
జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్లు జీపీఎస్లో ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జీపీఎస్ అన్నది దేశానికే రోల్ మోడల్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిటైరైన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని చెప్పారు. ఇదే సమయంలో.. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, డైలీ వేజెస్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?