Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Teleconference With Ministers And Collectors On Relief Measures In Flood Affected Areas

CM Chandrababu: సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Published Date :September 4, 2024 , 12:30 pm
By Chandra Shekhar Pamena
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
  • టెలీకాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రులు.. కలెక్టర్లు.. ఉన్నతాధికారులు..
  • ప్రతి ఒక్కిరికి డోర్ టూ డోర్ వెళ్లి ఆహారం అందించాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu: సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం.. ప్రతి ఇంటికి సహాయం అందించాలి అని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలి.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి.. వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’కి రంగం సిద్ధం.. మ్యాచుల షెడ్యూల్ ఇదే..

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..

ఇక, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరుదాం.. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలి.. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి అని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి.. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి.. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచండి.. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించడంతో పాటు పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Daggubati Purandeswari: వరద సహాయ చర్యల్లో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది..

ఇక, ఈరోజు ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించామని మంత్రులు, అధికారులు తెలిపారు. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే, 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను పంపించాం.. మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచాం.. వాటర్ ప్యాకెట్లు 10 లక్షల తరలించాం.. మరో 6 లక్షలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండగా.. వాటితో పారిశుధ్యం పనులు మొదలు పెట్టామని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap govt
  • cm chandrababu
  • flood affected areas
  • Floods

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions