Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Davos Cii Breakfast Session Ap Investments

CM Chandrababu: పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం.. నాలెడ్జ్ ఎకానమీతో ఆర్థిక విప్లవం

Published Date :January 20, 2026 , 2:08 pm
By Chandra Shekhar Pamena
  • దావోస్‌లో సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌కు సీఎం చంద్రబాబు హాజరు..
  • 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తి.. అందులో ఏపీ కీలకం..
  • పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం.. నాలెడ్జ్ ఎకానమీతో ఆర్థిక విప్లవం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం.. నాలెడ్జ్ ఎకానమీతో ఆర్థిక విప్లవం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Chandrababu: ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా “భారత్ కేంద్రంగా అభివృద్ధి- ఏపీ సానుకూలతలు” అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నాను.. దావోస్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రపంచ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటా, కొత్త ఆలోచనలు పంచుకుంటానని చెప్పారు. టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకుని పాలసీలను రూపొందిస్తానని స్పష్టం చేశారు. దావోస్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: BCCI Annual Contracts: గ్రేడ్ A+ ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ..! రోహిత్, కోహ్లీ లకు భారీ నష్టం తప్పదా?

Also Read

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Add as a preferred
source on google

అయితే, నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చగల శక్తి ఉందని, దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి.. ప్రపంచంలో మరే దేశంలో లేని యువ శక్తి భారత్‌లో ఉంది, దేశానికి ప్రస్తుతం తిరుగులేని సమర్థ నాయకత్వం ఉందన్నారు. ప్రస్తుతం ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానాలని స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, ఆ గ్రోత్ స్టోరీని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Read Also: Telangana : సినిమా టికెట్స్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ఇక, గతంలో పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు తెలుగు ప్రజల విజయాలు, ఏపీ బ్రాండ్ సానుకూల అంశంగా మారాయని తెలిపారు. ప్రతి రంగంలోనూ నిర్దిష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి.. ఏపీకి రావాలి అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తితో కొత్త చరిత్రకు నాంది పలికామని, ఇకపై ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయబోతున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్ల వినియోగం చేపట్టబోతున్నాం.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్ ప్రారంభించాలనే ఆలోచన ఉందని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: UP: యూపీలో వింతైన ఘటన.. ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!

అలాగే, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడం రాష్ట్ర బలాన్ని చాటుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఏపీకి ఉన్న ప్రధాన బలాలు అన్నారు. వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.. ఏపీకి వచ్చి అక్కడ అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను స్వయంగా చూసి నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలను పరీక్షించాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదు.. ఏపీ పారిశ్రామికవేత్తలకు అతిపెద్ద మార్కెట్‌గా మారుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh business friendly state
  • Andhra Pradesh growth story
  • AP foreign investments
  • AP investment destination
  • Chandrababu Naidu Davos

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions