YS Jagan Punganur Visit Cancelled: వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డి ప్రకటన
- వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు..
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Punganur Visit Cancelled: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిన్నారి అశ్వియ అంజూమ్ హత్య నేపథ్యంలో.. ఈ నెల 9వ తేదీన అశ్వియ అంజూమ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పుంగనూరు పర్యటనకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్.. అయితే, జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్టు ఈ రోజు వెల్లడించారు పెద్దిరెడ్డి.. చిన్నారి మృతి అందరినీ కలచి వేసిందన్న ఆయన.. కర్నూలులో లాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే జగన్ పుంగనూరు రావాలనుకున్నారు.. అయితే, వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారు.. పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారని.. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.. ఈ నేపథ్యంలోనే పుంగనూరు పర్యటనను వైఎస్ జగన్ రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు..
Read Also: IND vs BAN: ఇది నాకు రీబర్త్డే.. భావోద్వేగానికి గురైన టీమిండియా ప్లేయర్!
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
ఇక, ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేది అన్నారు పెద్దిరెడ్డి.. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పుంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి అని ఆరోపించారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తుందన్నారు.. ఇవన్నీ పక్కన బెట్టి ప్రజలు సంక్షేమం అందిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాగా, చిత్తూరు జిల్లా పుంగనూరులో గత నెల 29వ తేదీన మైనర్ బాలిక అదృశ్యం కేసు కలకలం సృష్టించింది.. రెండు రోజుల పాటు బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.. చివరికి ఈ నెల 2న పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం బయటపడింది. కానీ, పోలీసులు విచారణలో జాప్యం చేస్తూ వచ్చారని.. ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పుంగనూరు పర్యటనకు సిద్ధం కావడం.. మరోవైపు.. నిందితులను అరెస్ట్ చేయడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు వైఎస్ జగన్.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!