Thomas: మాజీ డిప్యూటీ సీఎంపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్.. మీ హయాంలో రూ.3500 కోట్ల అవినీతి..!
- మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై థామస్ హాట్ కామెంట్లు..
- ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం..
- నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.3,500 కోట్ల అవినీతి..
- నీ పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thomas: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.. 40 సంవత్సరాలుగా ప్రభుత్వ డబ్బులు తిని పంది కుక్కలాగా బతికే బతుకు మాది కాదు.. ఒక్కరోజు బతికినా నీతిగా నిజాయితీగా బ్రతుకుతాం.. నేను ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల్లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంటే.. నాపైన సీబీఐ ఎంక్వయిరీ వేయాలని నారాయణస్వామి అంటున్నాడు.. ఒరేయ్ పనికిమాలినోడ నీ పైన సీబీఐ ఎంక్వయిరీ వేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
Read Also: Extra-Marital Affairs: వివాహేతర సంబంధానికి అడ్డుగా రెండేళ్ల కూతురు.. కసాయి తల్లి ఏం చేసిందంటే..?
Also Read
ఇక, నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది.. నీ పైన సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి అని డిమాండ్ చేశారు థామస్.. లిక్కర్ స్కామ్ లో దొబ్బేసింది నువ్వు.. దీనిపైన మాట్లాడడం టైం వేస్ట్ గా ఉంది.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి.. అందరూ సమిష్టిగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామి ఏమి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.. నేను ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలోనే ఎస్ఆర్ పురం మండలంలో ఏపీఐఎస్సీ ద్వారా మూడు పరిశ్రమలు ప్రతినిధులతో మాట్లాడి పరిశ్రమల ఏర్పాటుకు నేను కృషి చేస్తుంటే.. దానినే ఈ పనికిమాలిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు.. మూడు పరిశ్రమలకు సుమారు 2000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయి.. దీనిని నారాయణస్వామి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. మన నియోజకవర్గంలో ఉన్న పేదలు పేదరికంగానే ఉండిపోవాలా? అని నారాయణస్వామిపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మండిపడ్డారు.. నారాయణస్వామి నువ్వు ఎక్సైజ్ శాఖలో మంత్రిగా పనిచేసినప్పుడు సుమారు 3500 కోట్లు అవినీతి జరిగింని ఆరోపించిన ఆయన.. సిట్ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేమీ తెలియదు అంటూ సిట్ అధికారుల కాళ్లపై పడ్డావు అంటూ విమర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్..
తాజావార్తలు
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!