Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. జొన్న పంట కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ. 994 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం, పంటల కొనుగోలు విధానం వేగవంతంగా, పారదర్శకంగా సాగుతోందని, ఇది మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు రూపొందించిన ‘తెలంగాణ ఎరువుల యాప్’ విజయవంతం కావడంతో, దాని ప్రమాణాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘ఫెర్టిలైజర్ ఫీల్డ్ స్టాఫ్’ (FFS) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నూతన ఎరువుల పంపిణీ విధానాన్ని నేటి నుంచి మరో 10 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
రాష్ట్రంలో సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు, అవగాహన అందించాలని ఆదేశించారు. తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఇదే సమావేశంలో చేనేత రంగానికి సరికొత్త సాంకేతికతను జోడించేలా నిర్వహించిన హ్యాండ్లూమ్ హ్యాకథాన్ లో విజేతగా నిలిచిన ప్రతిభావంతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సన్మానించారు. చేనేత కార్మికుల నైపుణ్యానికి సాంకేతికత తోడైతే మార్కెటింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయ రంగం బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!