YSRCP: పొత్తులపై వైసీపీ మంత్రులు హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉంది.. మిగిలిన మూడు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మంత్రి తెలిపారు.
Trinamool Congress: లోక్సభ బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. టీఎంసీ నుంచి పోటీ..
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం.. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులు అది చేసే మితి చేశామనే మాటల తప్ప పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు దాక తీసుకెళ్లారు.. జగన్ కొన్ని లక్షల ఇళ్లు కట్టించామని అన్నారు.
రానున్న ఎన్నికల్లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మిని అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.
PM Modi: కుటుంబం లేదని అంటున్నారు.. కానీ, దేశంలోని 140 కోట్ల మంది ‘మోడీ కా పరివార్’’..
మరోవైపు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, మత పిచ్చితో బీజేపీ, కుల పిచ్చితో జనసేన, కుట్రతో కాంగ్రెస్ చంద్రబాబుతో జతకట్టాయని దుయ్యబట్టారు. రేపు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీ పవన్ లను అడగాల్సిందేనని ఆరోపించారు. గత ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అందరూ జగన్ వల్లే గెలిచారు.. ఈ ఎన్నికల్లో సుమారు వంద సీట్ల గెలుపు భాద్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పజెప్పారని తెలిపారు. పెద్దిరెడ్డి బలపరిచిన చిత్తూరు శాసన సభ అభ్యర్థి విజయానందరెడ్డి, ఎంపీ రెడ్డప్పను భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!