YSRCP: పొత్తులపై వైసీపీ మంత్రులు హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉంది.. మిగిలిన మూడు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మంత్రి తెలిపారు.
Trinamool Congress: లోక్సభ బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. టీఎంసీ నుంచి పోటీ..
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం.. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులు అది చేసే మితి చేశామనే మాటల తప్ప పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు దాక తీసుకెళ్లారు.. జగన్ కొన్ని లక్షల ఇళ్లు కట్టించామని అన్నారు.
రానున్న ఎన్నికల్లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మిని అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.
PM Modi: కుటుంబం లేదని అంటున్నారు.. కానీ, దేశంలోని 140 కోట్ల మంది ‘మోడీ కా పరివార్’’..
మరోవైపు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, మత పిచ్చితో బీజేపీ, కుల పిచ్చితో జనసేన, కుట్రతో కాంగ్రెస్ చంద్రబాబుతో జతకట్టాయని దుయ్యబట్టారు. రేపు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీ పవన్ లను అడగాల్సిందేనని ఆరోపించారు. గత ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అందరూ జగన్ వల్లే గెలిచారు.. ఈ ఎన్నికల్లో సుమారు వంద సీట్ల గెలుపు భాద్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పజెప్పారని తెలిపారు. పెద్దిరెడ్డి బలపరిచిన చిత్తూరు శాసన సభ అభ్యర్థి విజయానందరెడ్డి, ఎంపీ రెడ్డప్పను భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!