MP Mithun Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఆధారాలతోనే సస్పెండ్ చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Comments on Suspended YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను పూర్తి ఆధారాలతోనే వైసీపీ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిందని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను విభేదించిన వారికి ఓటమి తప్పదని, గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుందని అన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్ని ఎలా దించేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఎమ్మెల్యేల చెప్పారని.. అయితే జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పారని అన్నారు. ఒక ఎమ్మెల్సీ కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని చెప్పారు. ఇదే సమయంలో.. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు కచ్ఛితంగా గెలవాలన్న లక్ష్యంతోనే పని చేస్తామని వెల్లడించారు.
Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది
Also Read
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- MLA Jagan: కన్నడిగులపై నాకు గౌరవం ఉంది.. ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి..
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
ఇదే సమయంలో ఎంపీ మోపీదేవి సైతం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనైతిక విధానాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా.. చంద్రబాబుది ఇదే పద్ధతని అన్నారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగిస్తుందని, 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఎంపీ మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు.
MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!