MP Mithun Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఆధారాలతోనే సస్పెండ్ చేశాం
MP Mithun Reddy Comments on Suspended YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను పూర్తి ఆధారాలతోనే వైసీపీ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిందని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను విభేదించిన వారికి ఓటమి తప్పదని, గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుందని అన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్ని ఎలా దించేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఎమ్మెల్యేల చెప్పారని.. అయితే జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పారని అన్నారు. ఒక ఎమ్మెల్సీ కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని చెప్పారు. ఇదే సమయంలో.. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు కచ్ఛితంగా గెలవాలన్న లక్ష్యంతోనే పని చేస్తామని వెల్లడించారు.
Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
ఇదే సమయంలో ఎంపీ మోపీదేవి సైతం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనైతిక విధానాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా.. చంద్రబాబుది ఇదే పద్ధతని అన్నారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగిస్తుందని, 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఎంపీ మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు.
MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!