MP Mithun Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఆధారాలతోనే సస్పెండ్ చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Comments on Suspended YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను పూర్తి ఆధారాలతోనే వైసీపీ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిందని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను విభేదించిన వారికి ఓటమి తప్పదని, గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుందని అన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్ని ఎలా దించేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఎమ్మెల్యేల చెప్పారని.. అయితే జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పారని అన్నారు. ఒక ఎమ్మెల్సీ కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని చెప్పారు. ఇదే సమయంలో.. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు కచ్ఛితంగా గెలవాలన్న లక్ష్యంతోనే పని చేస్తామని వెల్లడించారు.
Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది
Also Read
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
ఇదే సమయంలో ఎంపీ మోపీదేవి సైతం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనైతిక విధానాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా.. చంద్రబాబుది ఇదే పద్ధతని అన్నారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగిస్తుందని, 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఎంపీ మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు.
MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్
తాజావార్తలు
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!