చింతామణి నాటకం నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీజే ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. అయితే ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 200 ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తారా, విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లా అని హైకోర్టు సీజే ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది.
విచారణలో కేవలం అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామన్న న్యాయవాది తెలిపారు. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయంటే నిషేధిస్తారా అని న్యాయవాది ఉమేష్ ప్రశ్నించారు. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించిన ఉమేష్ అన్నారు. ఆర్టిస్టుల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా సీజె బెంచ్ కి బదిలీ చేశారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.