Child Kidnap Case: కేజీహెచ్ లో పాప కిడ్నాప్ నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లాలో పసిపాప కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. టెక్నాలజీ సాయంతో పాపను కిడ్నాప్ చేసిన ముఠా గుట్టురట్టుచేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిన్నారిని రక్షించారు. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిన్న 8 గంటలకు కెజిహెచ్ పాప కిడ్నాప్ అయ్యిందని సమాచారం వచ్చింది. నిన్న అన్ని చోట్ల పోలీసుల గాలించారు. మన ఇల్లు మన బాధ్యత ప్రోగ్రామ్ ద్వారా షాపుల్లో అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు పెట్టమని కోరాం.
చాలా మంది సీసీ కెమేరాలు పెట్టారు. బిడ్డను కిడ్నాప్ చేసిన మహిళల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలించి కొంత సమాచారం సేకరించాం అన్నారు సీపీ. కేజీహెచ్ లో ఆ మహిళ బిడ్డను తీసుకుని ఆటోలో గురుద్వార్ వైపు వెళ్ళింది. అక్కడ సీసీ కెమేరాలో లభించిన దృశ్యాలు క్లియర్ గా లేవు. అక్కడ ఉన్న షాపు సీసీ కెమెరాలో క్లియర్ గా బిడ్డను తీసుకెళ్ళిన మహిళల దృశ్యాలు కనబడ్డాయి. దీంతో త్వరగా కేసు ట్రేస్ చేసాం. గురుద్వార్ నుండి ఓ క్యాబ్ లో వారు శ్రీకాకుళం పయనం అయ్యారు.
Also Read
- Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
దానిని ట్రేస్ చేసి పట్టుకున్నాం. సీసీ కెమేరాలు ప్రతి ఒక్కరు అమర్చుకోవాలి. దాని వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. గాయత్రి,గీత,యశోద, పిల్లలు లేని రాజేష్ లక్ష్మీకి పిల్లలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం కేజీహెచ్ వచ్చారు. అక్కడ కొండమ్మ సహకారంతో యశోద పిల్లని తీసుకుని గురుద్వార్ వెళ్ళి రాజేష్ కు అప్పచెప్పింది.
పిల్లని అమ్మేందుకు వీరు 20 వేలు తీసుకున్నారు. యశోద నర్సులా కనబడం వల్ల తల్లి అప్పాయమ్మ బిడ్డను యశోదకు అప్పగించింది. కొండమ్మ విశాఖ జిల్లా జి మాడుగులకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. కొండమ్మతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొండమ్మ 5 వ బిడ్డ డెలివరీ కోసం కేజీహెచ్ కు వచ్చింది. కొండమ్మకు మగ బిడ్డ పుడితే ఇవ్వనంది ఆడపిల్ల పుడితే ఇస్తానంది. కాని కొండమ్మ కు పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఈ బిడ్డను తీసుకువెళ్ళారు. కేజీహెచ్ సెక్యూరిటీ సిబ్బంది పై విచారిస్తున్నాం. మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. దాని పై విచారణ చేస్తున్నామన్నారు మనీష్ కుమార్ సిన్హా.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!