Child Kidnap Case: కేజీహెచ్ లో పాప కిడ్నాప్ నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లాలో పసిపాప కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. టెక్నాలజీ సాయంతో పాపను కిడ్నాప్ చేసిన ముఠా గుట్టురట్టుచేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిన్నారిని రక్షించారు. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిన్న 8 గంటలకు కెజిహెచ్ పాప కిడ్నాప్ అయ్యిందని సమాచారం వచ్చింది. నిన్న అన్ని చోట్ల పోలీసుల గాలించారు. మన ఇల్లు మన బాధ్యత ప్రోగ్రామ్ ద్వారా షాపుల్లో అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు పెట్టమని కోరాం.
చాలా మంది సీసీ కెమేరాలు పెట్టారు. బిడ్డను కిడ్నాప్ చేసిన మహిళల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలించి కొంత సమాచారం సేకరించాం అన్నారు సీపీ. కేజీహెచ్ లో ఆ మహిళ బిడ్డను తీసుకుని ఆటోలో గురుద్వార్ వైపు వెళ్ళింది. అక్కడ సీసీ కెమేరాలో లభించిన దృశ్యాలు క్లియర్ గా లేవు. అక్కడ ఉన్న షాపు సీసీ కెమెరాలో క్లియర్ గా బిడ్డను తీసుకెళ్ళిన మహిళల దృశ్యాలు కనబడ్డాయి. దీంతో త్వరగా కేసు ట్రేస్ చేసాం. గురుద్వార్ నుండి ఓ క్యాబ్ లో వారు శ్రీకాకుళం పయనం అయ్యారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
దానిని ట్రేస్ చేసి పట్టుకున్నాం. సీసీ కెమేరాలు ప్రతి ఒక్కరు అమర్చుకోవాలి. దాని వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. గాయత్రి,గీత,యశోద, పిల్లలు లేని రాజేష్ లక్ష్మీకి పిల్లలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం కేజీహెచ్ వచ్చారు. అక్కడ కొండమ్మ సహకారంతో యశోద పిల్లని తీసుకుని గురుద్వార్ వెళ్ళి రాజేష్ కు అప్పచెప్పింది.
పిల్లని అమ్మేందుకు వీరు 20 వేలు తీసుకున్నారు. యశోద నర్సులా కనబడం వల్ల తల్లి అప్పాయమ్మ బిడ్డను యశోదకు అప్పగించింది. కొండమ్మ విశాఖ జిల్లా జి మాడుగులకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. కొండమ్మతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొండమ్మ 5 వ బిడ్డ డెలివరీ కోసం కేజీహెచ్ కు వచ్చింది. కొండమ్మకు మగ బిడ్డ పుడితే ఇవ్వనంది ఆడపిల్ల పుడితే ఇస్తానంది. కాని కొండమ్మ కు పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఈ బిడ్డను తీసుకువెళ్ళారు. కేజీహెచ్ సెక్యూరిటీ సిబ్బంది పై విచారిస్తున్నాం. మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. దాని పై విచారణ చేస్తున్నామన్నారు మనీష్ కుమార్ సిన్హా.
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!