పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బదులు.. ఇడ్లీ, సాంబార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం నాడు మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ, సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. మండలంలోని చిర్రావూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం ఇడ్లీ, సాంబార్ వడ్డించనున్నారు.
Read Also: రింగు వలలపై కొలిక్కి రాని చర్చలు
Also Read
కాగా తాడేపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐదు ఇడ్లీలు ఇవ్వనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో మధ్యాహ్న భోజనం పథకంలో పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అధికారులు అందజేసేవారు.
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?